Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
అణుబాంబు కంటే డేంజర్..భారత్ పై పెద్ద దాడి చేసిన పాకిస్తాన్!..వీడియో చూస్తే ఏమైపోతారో
జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ దాడికి కుట్ర పన్నింది పాకిస్తానే అని భారత్ గుర్తించింది. దీంతో పాకిస్ాన్, పీఓకేలోని పలు ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మిసైల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చచ్చారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత భారత్ మీద దాడికి పాక్ ప్రయత్నించడం..తోక కత్తిరించేలా భారత్ చేపట్టిన చర్యలతో రక్షించండి మహాప్రభో అంటూ పాక్ అమెరికా,చైనా చుట్టు ప్రదిక్షణలు కొట్టింది.
భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. అయినప్పటికీ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తతంగానే ఉన్నాయి. అయితే ఈ సమయంలో పాకిస్తానీ గాయకుడు చాహత్ ఫతే అలీ ఖాన్ విడుదల చేసిన ఒక దేశభక్తి గీతం ఇంటర్నెట్ లో పెను సంచలనం సృష్టిస్తోంది. తనదైన విలక్షణ గాత్రంతో ఇప్పటికే సోషల్ మీడియాలో సుపరిచితుడైన చాహత్.. 'మేరే వతన్ మేరే చమన్' (నా దేశమా, నా ఉద్యానవనమా) అంటూ పాకిస్తాన్ పై తనకున్న దేశభక్తిని చాటుకుంటూ కొత్త పాటను ఆలపించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా వేదికలపై విడుదలైన ఈ గీతం క్షణాల్లో వైరల్గా మారి నెటిజన్లను విస్మయానికి గురిచేసింది.

ఈ పాట వీడియోలో పాకిస్తాన్ సైన్యం, ఆ దేశంలోని కీలక ప్రదేశాలు నేపథ్యంగా కనిపిస్తుండగా చాహత్ ఫతే అలీ ఖాన్ తనదైన విలక్షణమైన గాత్ర శైలితో, ప్రత్యేకమైన సాహిత్యంతో గొంతు సవరించుకోవడం చూపరులను ఆకట్టుకుంది. ఆయన గానం, పాటలోని పదాలు నెటిజన్లకు కొత్త మీమ్ మెటీరియల్గా మారాయి. ఈ పాట ఇంటర్నెట్లో మీమ్స్ జాతరకు తెరలేపింది.
చాలామంది ఈ దేశభక్తి గీతం చూసి పాకిస్తాన్ సైన్యం కంటే ఈయనే పెద్ద దాడి చేశాడంటూ చమత్కరించారు. మరో నెటిజన్ అయితే పాకిస్తాన్ భారత్పై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించింది, ఇది ఎలాంటి అణుదాడి కన్నా భయంకరమైనదని తాను లొంగిపోతున్నాను, భారత దళాలన్నీ పూర్తిగా బేషరతుగా లొంగిపోవాలని ఆదేశిస్తున్నాను.. ఇది భరించలేనంతగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
కొందరైతే దీన్ని పాకిస్తానీ గాయకుడి సంగీత దాడిగా అభివర్ణిస్తూ.. భారత్ కూడా ఇలాంటి సంగీత అస్త్రాలను ప్రయోగించాలని సూచించారు. దేశభక్తిని చాటాలన్న చాహత్ ఫతే అలీ ఖాన్ ప్రయత్నం ఇంటర్నెట్ లో నవ్వుల పువ్వులు పూయించి సరిహద్దులకు అతీతంగా చర్చనీయాంశంగా మారింది. సంగీతం ప్రశంసలతో అయినా,మీమ్స్ తో అయినా ఎలాగైనా సరిహద్దులు దాటుతుందని ఇది మరోసారి నిరూపించింది.



Click it and Unblock the Notifications