Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్గా ఉండొచ్చు!
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికే గుండెపోటు ఎక్కువగా వస్తుందట.. అవి ఏవేవి అంటే?
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ మహమ్మారి బారిన పడి.. కొన్ని దేశాలు కూడా కోలుకోలేదు. ఆ మహమ్మారి సృష్టించిన విధ్వంసానికి దేశాల ఆర్ధిక పరిస్థితులే అతలాకుతలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ మహమ్మారి సోకిన ప్రజల్లో మాత్రం ఇంకా దాని ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది.
కరోనా సోకిన వారికి గుండెపోటు, స్ట్రోక్ కారణంగా మరణించే అవకాశముందని అమెరికాలోని కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ ప్రమాదం మూడేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారికే అధికంగా ప్రమాదకరంగా ఉంటుందని ఆ పరిశోధనలో తేలింది. దీంతోపాటు అనేక సంచలన విషయాలు ఆ పరిశోధనలో బయటపడింది. అవేంటో తెలుసుకుందాం..

పరిశోధనలో ఏం తేలిందంటే?
అమెరికా యొక్క అతిపెద్ద వైద్య పరిశోధనా సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విడుదల చేసింది. ఈ పరిశోధనలో.. కరోనా సోకిన వారిలో మూడేళ్లపాటు ఈ సమస్య ఉంటుందని తేలింది. కరోనా మొదటి వేవ్లో ఎవరికైతే సోకిందో.. వారికే ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకొని, వైరస్ సోకని వారికంట.. మొదటి వేవ్లో వైరస్ బారిన పడిన వారికే ఎక్కువగా ప్రమాదమని వెల్లడైంది.
దీనిని నిర్ధారించగలమా?
ఈ పరిశోధనపై ఎన్ఐహెచ్ యొక్క నేషనల్ హార్ట్, లంగ్, బ్లడ్ ఇన్స్టిట్యూట్(NHLBI)లో కార్డియోవాస్కులర్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ గో స్పందించారు. ఈ పరిశోధన దీర్ఘకాలిక గుండె జబ్బులు, కరోనా కారణంగా కలిగే సమస్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధనలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే కోవిడ్ సోకి గుండెపోటుతో మృతి చెందుతున్న వారికి తగిన చికిత్స అందించగలమని పేర్కొన్నారు.
ఏ ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ ప్రమాదమంటే..
తీవ్రమైన కోవిడ్-19 రోగులలో బ్లెడ్ గ్రూప్, గుండెపోటు సమస్యలను పెంచడానికి మధ్య సాధ్యమయ్యే జన్యు సంబంధిత సమస్యలపై కూడా ఈ పరిశోధనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కరోనా తరువాత A, B, AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. O బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందని అందులో తేలింది.
ఎంతమంది కరోనా బారిన పడ్డారంటే?
కరోనా రోగులు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువనే అంటున్నారు పరిశోధకులు. టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రమాద కారకాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది కరోనా బారిన పడ్డారని, వారికి ఈ ముప్పు ఉండే అవకాశముందని పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications











