Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఈసారి పోలీసులు సిక్స్ కొట్టారు, విరాట్ కోహ్లి రెస్టారెంట్ అండ్ పబ్ మీద కేసు ఎందుకుంటే ?
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్కు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లి తాజాగా ప్రపంచకప్లో కూడా రాణించాడు.
క్రికెటర్ విరాట్ కోహ్లి తన క్రీడా నైపుణ్యానికి మాత్రమే కాకుండా తన వ్యాపారాలు విజయవంతంగా నిర్వహించడంలో కూడా సక్సస్ అయ్యాడు. విరాట్ కోహ్లి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్ లు ఉన్న రెస్టారెంట్లతో సహా అనేక వ్యాపారాలను చేస్తున్నాడు. అందులో బెంగళూరులోని విరాట్ కోహ్లి రెస్టారెంట్ కూడా ఒకటి.

బెంగళూరులోని వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ ఉంది. కర్ణాటక ప్రభుత్వం అనుమతించిన సమయానికి మించి విరాట్ కోహ్లికి చెందిన రెస్టారెంట్ అండ్ పబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో రెస్టారెంట్ వన్8 కమ్యూన్ యజమాని విరాట్ కోహ్లి పేరు వార్తల్లో నిలిచింది.
బెంగళూరు నగరంలోని కస్తూరి బా రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ పై అంతస్తులోని పబ్ అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా నిర్వహిస్తున్నారని కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం అందింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కబ్బన్ పార్క్ పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను పరిశీలిస్తూ వెళ్లారు.
అర్ధరాత్రి 1 గంట తర్వాత పబ్ ల్లో గంటల తరబడి కస్టమర్లు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు విరాట్ కోహ్లికి చెందిన పబ్ లోకి వెళ్లారు. అనుమతి ఇచ్చిన సమయం తర్వాత కూడా కస్టమర్లకు సేవలు అందిస్తున్నారని పోలీసులు ప్రత్యక్షంగా చూశారు.
జూలై 6వ తేదీన తెల్లవారుజామున 1.20 గంటలకు పబ్ వినియోగదారులకు సేవలందిస్తున్నట్లు గుర్తించారు.పబ్ లు క్లోజ్ చేసే సమయానికి మించి కస్టమర్లకు మద్యం, ఆహారం అందిస్తున్నారని తెలుసుకున్న మరో మూడు పబ్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.
బెంగుళూరులో అర్ధరాత్రి 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్ లు, పబ్ ల్లో కస్టమర్లు ఉండటానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సమయం అర్దరాత్రి 1 గంట సమయం దాటిపోయిన తరువాత కూడా విరాట్ కోహ్లికి చెందిన వన్ 9 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ లో కస్టమర్లు ఉండటంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.



Click it and Unblock the Notifications











