Latest Updates
-
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా?
ఈసారి పోలీసులు సిక్స్ కొట్టారు, విరాట్ కోహ్లి రెస్టారెంట్ అండ్ పబ్ మీద కేసు ఎందుకుంటే ?
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్కు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లి తాజాగా ప్రపంచకప్లో కూడా రాణించాడు.
క్రికెటర్ విరాట్ కోహ్లి తన క్రీడా నైపుణ్యానికి మాత్రమే కాకుండా తన వ్యాపారాలు విజయవంతంగా నిర్వహించడంలో కూడా సక్సస్ అయ్యాడు. విరాట్ కోహ్లి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్ లు ఉన్న రెస్టారెంట్లతో సహా అనేక వ్యాపారాలను చేస్తున్నాడు. అందులో బెంగళూరులోని విరాట్ కోహ్లి రెస్టారెంట్ కూడా ఒకటి.

బెంగళూరులోని వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ ఉంది. కర్ణాటక ప్రభుత్వం అనుమతించిన సమయానికి మించి విరాట్ కోహ్లికి చెందిన రెస్టారెంట్ అండ్ పబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో రెస్టారెంట్ వన్8 కమ్యూన్ యజమాని విరాట్ కోహ్లి పేరు వార్తల్లో నిలిచింది.
బెంగళూరు నగరంలోని కస్తూరి బా రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ పై అంతస్తులోని పబ్ అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా నిర్వహిస్తున్నారని కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం అందింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కబ్బన్ పార్క్ పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను పరిశీలిస్తూ వెళ్లారు.
అర్ధరాత్రి 1 గంట తర్వాత పబ్ ల్లో గంటల తరబడి కస్టమర్లు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు విరాట్ కోహ్లికి చెందిన పబ్ లోకి వెళ్లారు. అనుమతి ఇచ్చిన సమయం తర్వాత కూడా కస్టమర్లకు సేవలు అందిస్తున్నారని పోలీసులు ప్రత్యక్షంగా చూశారు.
జూలై 6వ తేదీన తెల్లవారుజామున 1.20 గంటలకు పబ్ వినియోగదారులకు సేవలందిస్తున్నట్లు గుర్తించారు.పబ్ లు క్లోజ్ చేసే సమయానికి మించి కస్టమర్లకు మద్యం, ఆహారం అందిస్తున్నారని తెలుసుకున్న మరో మూడు పబ్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.
బెంగుళూరులో అర్ధరాత్రి 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్ లు, పబ్ ల్లో కస్టమర్లు ఉండటానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సమయం అర్దరాత్రి 1 గంట సమయం దాటిపోయిన తరువాత కూడా విరాట్ కోహ్లికి చెందిన వన్ 9 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ లో కస్టమర్లు ఉండటంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.



Click it and Unblock the Notifications