Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళ మరణించిందని మార్చురీలో పెట్టారు, కానీ ప్రాణాలతో లేచి కూర్చుంది
కేరళ రాష్ట్రంలో ఒక మహిళ మరణించిందని భావించి ఆమెను మార్చురీలో పెట్టారు. కానీ ఆమె బ్రతికే ఉందని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు, భయపడిపోయారు. ఇది ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోయారు.
ఒక సారి ఇలా ఊహించుకోండి, బ్రతికి ఉన్న మనిషిని మరణించారనుకొని మార్చురీలో ఉన్న ఫ్రీజర్ లో పెడితే ఎలా ఉంటుంది?. ఇది ఏ వ్యక్తికైనా పీడకల లాంటింది. ఇది ఎవ్వరికీ ఎప్పటికీ జరగకూడదు అని అందరూ అనుకుంటారు. కానీ, ఇది భారత దేశంలో జరిగింది.
మరణించిందని భావించి మహిళను మార్చురీలో ఉన్న ఫ్రీజర్ లో పెట్టారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మరణించింది అనుకున్నారు. అయితే మార్చురీ లో ఫ్రీజర్ లో ఉన్న మహిళ బ్రతికే ఉంది.
ఈ ఆందోళన కలిగించే సంఘటన గురించి మర్రిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆ మహిళ వయస్సు 51 సంవత్సరాలు :
కేరళ కు చెందిన ఈ మహిళ వయస్సు 51 సంవత్సరాలు, ఈమె పేరు రత్నం. ఈమెకు పచ్చకామెర్ల వ్యాధి రావడంతో చికిత్స నిమిత్తం ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఈమె స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు ఈమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అందుచేత ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు.

మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా :
కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెలో చలనం లేదని మరియు దేనికి ప్రతిస్పందించడం లేదని గుర్తించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమె మరణించిందని భావించి, ఆమె దేహాన్ని దగ్గరలో ఉన్న మార్చురీలో పెట్టారు. బంధుమిత్రులందరికీ ఆమె మరణించిందని చెప్పి, దహన సంస్కారాలు చేద్దామని మళ్ళీ ఆ మార్చురీ వద్దకు వచ్చారు.

జీవితంలో ఎప్పుడూ ఎదురు కానీ ఒక షాక్ కి గురయ్యారు :
దహన సంస్కారాలు చేద్దామని ఆ మార్చురీ చేరుకున్న రత్నం కుటుంబసభ్యులకు, వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని గట్టి షాక్ తగిలింది. అందుకు కారణం చనిపోయిందని అనుకున్న ఆ మహిళ గంట తర్వాత వచ్చి చుస్తే బ్రతికే ఉంది. వాళ్ళ బంధువుల్లో ఒక వ్యక్తి, రత్నం ఊపిరి తీసుకుంటున్న విషయాన్ని గమనించి అది వారికి చెప్పాడు. దీంతో ఆమెను దగ్గరో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

చివరికి మరణించింది :
పచ్చ కామెర్ల వ్యాధి వల్ల ఆమె శరీరంలోని అవయవాలన్నీ విఫలమయ్యాయి, పని చేయకుండా పోయాయి. ఆమెను కాపాడటానికి వైద్యులు ఏమి చేయలేని స్థితికి పరిస్థితి దిగజారిపోయింది. అదే రోజు సాయంత్రం ఆమె మరణించింది.
ఒకవేళ ఆమె కుటుంబం ఆమెను ఆ గంట సేపు మార్చురీలో గనుక పెట్టకపోయి ఉంటే, మరికొన్ని రోజులు ఆమె ఆ వ్యాధి పై పోరాడి బ్రతికి ఉండేదేమో, అయితే చివరిగా విధిని ఎవ్వరు మార్చలేరు కదా !



Click it and Unblock the Notifications