Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మహిళ మరణించిందని మార్చురీలో పెట్టారు, కానీ ప్రాణాలతో లేచి కూర్చుంది
కేరళ రాష్ట్రంలో ఒక మహిళ మరణించిందని భావించి ఆమెను మార్చురీలో పెట్టారు. కానీ ఆమె బ్రతికే ఉందని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు, భయపడిపోయారు. ఇది ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోయారు.
ఒక సారి ఇలా ఊహించుకోండి, బ్రతికి ఉన్న మనిషిని మరణించారనుకొని మార్చురీలో ఉన్న ఫ్రీజర్ లో పెడితే ఎలా ఉంటుంది?. ఇది ఏ వ్యక్తికైనా పీడకల లాంటింది. ఇది ఎవ్వరికీ ఎప్పటికీ జరగకూడదు అని అందరూ అనుకుంటారు. కానీ, ఇది భారత దేశంలో జరిగింది.
మరణించిందని భావించి మహిళను మార్చురీలో ఉన్న ఫ్రీజర్ లో పెట్టారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మరణించింది అనుకున్నారు. అయితే మార్చురీ లో ఫ్రీజర్ లో ఉన్న మహిళ బ్రతికే ఉంది.
ఈ ఆందోళన కలిగించే సంఘటన గురించి మర్రిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆ మహిళ వయస్సు 51 సంవత్సరాలు :
కేరళ కు చెందిన ఈ మహిళ వయస్సు 51 సంవత్సరాలు, ఈమె పేరు రత్నం. ఈమెకు పచ్చకామెర్ల వ్యాధి రావడంతో చికిత్స నిమిత్తం ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఈమె స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు ఈమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అందుచేత ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు.

మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా :
కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెలో చలనం లేదని మరియు దేనికి ప్రతిస్పందించడం లేదని గుర్తించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమె మరణించిందని భావించి, ఆమె దేహాన్ని దగ్గరలో ఉన్న మార్చురీలో పెట్టారు. బంధుమిత్రులందరికీ ఆమె మరణించిందని చెప్పి, దహన సంస్కారాలు చేద్దామని మళ్ళీ ఆ మార్చురీ వద్దకు వచ్చారు.

జీవితంలో ఎప్పుడూ ఎదురు కానీ ఒక షాక్ కి గురయ్యారు :
దహన సంస్కారాలు చేద్దామని ఆ మార్చురీ చేరుకున్న రత్నం కుటుంబసభ్యులకు, వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని గట్టి షాక్ తగిలింది. అందుకు కారణం చనిపోయిందని అనుకున్న ఆ మహిళ గంట తర్వాత వచ్చి చుస్తే బ్రతికే ఉంది. వాళ్ళ బంధువుల్లో ఒక వ్యక్తి, రత్నం ఊపిరి తీసుకుంటున్న విషయాన్ని గమనించి అది వారికి చెప్పాడు. దీంతో ఆమెను దగ్గరో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

చివరికి మరణించింది :
పచ్చ కామెర్ల వ్యాధి వల్ల ఆమె శరీరంలోని అవయవాలన్నీ విఫలమయ్యాయి, పని చేయకుండా పోయాయి. ఆమెను కాపాడటానికి వైద్యులు ఏమి చేయలేని స్థితికి పరిస్థితి దిగజారిపోయింది. అదే రోజు సాయంత్రం ఆమె మరణించింది.
ఒకవేళ ఆమె కుటుంబం ఆమెను ఆ గంట సేపు మార్చురీలో గనుక పెట్టకపోయి ఉంటే, మరికొన్ని రోజులు ఆమె ఆ వ్యాధి పై పోరాడి బ్రతికి ఉండేదేమో, అయితే చివరిగా విధిని ఎవ్వరు మార్చలేరు కదా !



Click it and Unblock the Notifications











