Latest Updates
-
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.!
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ భారత ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని జోస్యం చెప్పిన ఆస్ట్రాలజర్
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ భారత ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని జోస్యం చెప్పిన ఆస్ట్రాలజర్
డి జ్ఞానేశ్వర్ అనే హైదరాబాద్ కి చెందిన ఆస్ట్రాలజర్ గతంలో ఎన్నో సంచలన అంశాలను తన జోస్యం ద్వారా ముందుగానే తెలియచేశారన్న సంగతి తెలిసిందే.
ఇటీవలి ప్రెస్ మీట్ లో, మరొక సెన్సేషనల్ విషయాన్ని వెల్లడించారు. అందాల రాశి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ లు రాజకీయాలలోకి ప్రవేశిస్తారని జోస్యం చెప్పారితను. రాబోయే కాలంలో ఐశ్వర్య భారత ప్రధానిగా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని తెలియచేశారు.
ఆరాధ్య కూడా ప్రధాని అవుతుందని జోస్యం
డి. జ్ఞానేశ్వర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి సంచలన విషయాలను జోస్యం ద్వారా వివరించారు.
పీఎం నరేంద్ర మోడీ 2019 జెనెరల్ ఎలక్షన్స్ లో మళ్ళీ అధికారాన్ని చేపడతారని అలాగే యునైటడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ పదవిని డోనాల్డ్ ట్రంప్ రెండవసారి కూడా చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా రజినీ కాంత్ ఎన్నికవుతాడని కూడా ఈయన జోస్యం చెప్పారు. అలాగే, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య 2024లో యుద్ధం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సెన్సేషనల్ ప్రెడిక్షన్స్
ఈ ప్రెడిక్షన్స్ అన్నిటిలో నెటిజన్ల అటెన్షన్ ను ఎక్కువగా ఆకర్షించినది "ఆరాధ్య"కు సంబంధించిన అంశం. అమితాబ్ బచ్చన్ మనవరాలు "ఆరాధ్య" రానున్న కాలంలో ప్రధాని అవుతుందని జోస్యం చెప్పారు జ్ఞానేశ్వర్.
అయితే, ఈ ప్రెడిక్షన్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఒక వేళ బచ్చన్ కుటుంబం వారు రానున్న కాలంలో ఆరాధ్యను ప్రధానిగా చూడాలనుకుంటే ఆరాధ్య పేరును రోహిణీగా మార్చాలన్నది ఇందులో గమనించదగిన అంశం.
అలాగే, రిలయన్స్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీల కుమారుడు ఆకాష్ 2019లో వివాహం చేసుకుంటాడని ఈ జోతిష్యుడు ఇదివరకే జోస్యం చెప్పారు.
జ్ఞానేశ్వర్ గారు ఇదివరకు చెప్పిన జోస్యాలన్నీ అక్యురేట్ గా ఫలితాన్ని ఇచ్చాయన్న సంగతి తెలిసిందే. మరి ఆరాధ్య విషయంలో ఈ జోస్యం గురించి క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? కామెంట్స్ సెక్షన్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అలాగే ఇంట్రెసింగ్ అప్ డేట్స్ కోసం బోల్డ్ స్కై ను ఫాలో అవండి.



Click it and Unblock the Notifications