ఇంజనీరింగ్ అమ్మాయిల పేరుతో సెక్స్ దందా, వాడిన కండోమ్స్ చూపి డబ్బులు గుంజేవారు

అందమైన అమ్మాయిలను రప్పించి విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంచి గుట్టుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ లు చేసి వ్యభిచారం దందా నడపడమే వీరి పని.ఇంజనీరింగ్ అమ్మాయిల పేరుతో సెక్స్ దందా, వాడిన కండోమ్స్ చూపి డబ్బులు గుంజేవారు

By Staff

కొందరు అమ్మాయిలు తాము ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులమని చెప్పి ఫ్లాట్ అద్దెకు తీసకున్నారు. ఆ తర్వాత వ్యభిచారం దందా స్టార్ట్ చేశారు. అలాగే విటులు వాడిన కండోమ్స్‌తో అనేక మంది ధనవంతుల పిల్లలను బ్లాక్‌మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు కూడా గుంజారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతంలో దిలీప్ గోయల్, అర్జున్ పాల్ లనే ఇద్దరు యువకులు ఓ ఫ్లాట్ కేంద్రంగా అమ్మాయిలతో వ్యభిచారం స్టార్ట్ చేయించారు.

అమ్మాయిలను రప్పించి

అమ్మాయిలను రప్పించి

అందమైన అమ్మాయిలను రప్పించి విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంచి గుట్టుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ లు చేసి వ్యభిచారం దందా నడపడమే వీరి పని. గతంలో దిలీప్ గోయల్ రాజస్థాన్ రైఫిల్స్ లో పని చేసేవాడు. ఆ ఉద్యోగం నచ్చలేదో లేదంటే ఆదాయం సరిపోలేదో.. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. కొత్త దందా స్టార్ట్ చేశారు. ఆరుగురు ఏజెంట్లను పెట్టుకొని అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నడపడం మొదలుపెట్టాడు.

ఇంటి యజమాని నమ్మారు

ఇంటి యజమాని నమ్మారు

ఇక భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతంలో కొందరు అమ్మాయిలను ఒక ఫ్లాట్‌లో అద్దెకు ఉంచారు దిలీప్ గోయల్, అర్జున్ పాల్‌ . ఆ అమ్మాయిలు కూడా తాము ఇంజనీరింగ్ చదివే విద్యార్థులమని చెప్పడంతో ఇంటి యజమాని నమ్మారు. వీరివద్దకూ తరచుగా దిలీప్ గోయల్, అర్జున్ పాల్‌ రోజూ వచ్చి వెళ్లేవారు. దీనిపై పోలీసులకు సమాచారం వెళ్లింది.

ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అమ్మాయిలు

ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అమ్మాయిలు

దీంతో పోలీసులు మఫ్టీలో సోదాలు నిర్వహించి వ్యభిచారం చేస్తుండగా వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఫ్లాట్‌లో ఉండే అమ్మాయిలతో పాటు.. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అమ్మాయిలను రప్పించి విలాసవంతమైన ఫ్లాట్‌లలో వ్యభిచారం చేసేవారని తేలింది. ఆన్‌లైన్‌లోనే విటులను బుకింగ్‌ చేసుకుని వీరి వ్యభిచారం దందా నడిపిస్తున్నారు.

విటులు వాడిన కండోమ్‌లను దాచి పెట్టి

విటులు వాడిన కండోమ్‌లను దాచి పెట్టి

దిలీప్ గోయల్ రోజువారీగా అమ్మాయిలను విటుల వద్దకు పంపించి వారి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, విటులు వాడిన కండోమ్‌లను దాచి పెట్టి వాటిని ధనవంతులైన విటులకు చూపించి, బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి డబ్బు కూడా గుంజారు.

అమ్మాయిలను అదుపులోకి తీసుకుని

అమ్మాయిలను అదుపులోకి తీసుకుని

ఈ ఫ్లాట్ నుంచి ఢిల్లీ, గ్వాలియర్, ముంబై నగరాలకు చెందిన 19 నుంచి 23 ఏళ్ల వయసుగల అమ్మాయిలను అదుపులోకి తీసుకుని వారిని ప్రభుత్వ మహిళా సదనానికి తరలించారు. సెక్స్ రాకెట్ సూత్రధారులైన దిలీప్ గోయల్, అర్జున్ పాల్ తోపాటు మరో నిర్వాహకురాలు ముంబైకు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

Desktop Bottom Promotion