Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
అక్కడ తేళ్లను ఒంటిపై వేసుకుని ఆడుకుంటారు, అయినా తేళ్లు ఏమీ అనవు
ఎందుకంటే ప్రతి తేళ్లపంచమికి అక్కడుండే తేళ్లు ఎవర్నీ కుట్టవట. అందుకే అందరూ ఆ రోజు తేళ్లతో ఆటలాడుకుంటూ ఉంటారు. చేతులపైన, నాలుకపైన, తలపైనా తేళ్లను వేసుకుంటారు. ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం.
ఇటీవల అందరూ నాగుల పంచమిని చేసుకున్నారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఏటా ఆ పండుగను చేసుకుంటూనే ఉంటాం. అయితే అదే పంచమి రోజూ ఒక రోజు తేళ్ల పండుగ చేసుకున్నారు. అంటే తేళ్ల పంచమిని నిర్వహించుకున్నారు.

కందు కూర్ కొండమ్మ గుట్ట
ఆ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేటకు దగ్గర్లో ఉంటుంది. కర్నాటకలోని యాద్గిర్ డిస్ట్రిక్ట్ లోని కందు కూర్ కొండమ్మ గుట్టపై ఇలాంటి పండుగ జరుగుతుంది. అక్కడ తేళ్లను దేవుళ్లుగా భావిస్తూ పూజలు చేస్తారు.

రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు
ఇక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే ఎక్కువగా వెళ్తారు.
మొదట ఆలయంలో పూజలు చేస్తారు. తర్వాత గుడి చుట్టూ ఉన్న రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు. వాటిని చేతులపై, ముఖంపై ఉంచుకుంటారు. ఒళ్లంతా అవి పాకినా కూడా అస్సలు భయపడరు.

తేళ్లు ఎవర్నీ కుట్టవట
ఎందుకంటే ప్రతి తేళ్లపంచమికి అక్కడుండే తేళ్లు ఎవర్నీ కుట్టవట. అందుకే అందరూ ఆ రోజు తేళ్లతో ఆటలాడుకుంటూ ఉంటారు. చేతులపైన, నాలుకపైన, తలపైనా తేళ్లను వేసుకుంటారు. ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం. ఒకవేళ తేలు కుడితే గుడిలోని విభూది రాసుకుంటే చాలట.

ఏదో మహిమ ఉండడం వల్లే
ఏటా నాగపంచమి రోజూ వీళ్లు ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. కొండ మహేశ్వరి అమ్మవారి అండ ఉన్నంత వరకు తమకేమీ కాదని ఇక్కడి వారి విశ్వాసం. కేవలం తేళ్ల పంచమి రోజూ మాత్రమే ఇక్కడ ఏ రాయి కింద చూసినా తేలు ఉంటుందట. ఇక్కడో ఏదో మహిమ ఉండడం వల్లే తేలు కరిచినా ఏమీ కావడం లేదని భక్తుల నమ్మకం.



Click it and Unblock the Notifications