Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
అక్కడ తేళ్లను ఒంటిపై వేసుకుని ఆడుకుంటారు, అయినా తేళ్లు ఏమీ అనవు
ఎందుకంటే ప్రతి తేళ్లపంచమికి అక్కడుండే తేళ్లు ఎవర్నీ కుట్టవట. అందుకే అందరూ ఆ రోజు తేళ్లతో ఆటలాడుకుంటూ ఉంటారు. చేతులపైన, నాలుకపైన, తలపైనా తేళ్లను వేసుకుంటారు. ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం.
ఇటీవల అందరూ నాగుల పంచమిని చేసుకున్నారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఏటా ఆ పండుగను చేసుకుంటూనే ఉంటాం. అయితే అదే పంచమి రోజూ ఒక రోజు తేళ్ల పండుగ చేసుకున్నారు. అంటే తేళ్ల పంచమిని నిర్వహించుకున్నారు.

కందు కూర్ కొండమ్మ గుట్ట
ఆ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేటకు దగ్గర్లో ఉంటుంది. కర్నాటకలోని యాద్గిర్ డిస్ట్రిక్ట్ లోని కందు కూర్ కొండమ్మ గుట్టపై ఇలాంటి పండుగ జరుగుతుంది. అక్కడ తేళ్లను దేవుళ్లుగా భావిస్తూ పూజలు చేస్తారు.

రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు
ఇక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే ఎక్కువగా వెళ్తారు.
మొదట ఆలయంలో పూజలు చేస్తారు. తర్వాత గుడి చుట్టూ ఉన్న రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు. వాటిని చేతులపై, ముఖంపై ఉంచుకుంటారు. ఒళ్లంతా అవి పాకినా కూడా అస్సలు భయపడరు.

తేళ్లు ఎవర్నీ కుట్టవట
ఎందుకంటే ప్రతి తేళ్లపంచమికి అక్కడుండే తేళ్లు ఎవర్నీ కుట్టవట. అందుకే అందరూ ఆ రోజు తేళ్లతో ఆటలాడుకుంటూ ఉంటారు. చేతులపైన, నాలుకపైన, తలపైనా తేళ్లను వేసుకుంటారు. ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం. ఒకవేళ తేలు కుడితే గుడిలోని విభూది రాసుకుంటే చాలట.

ఏదో మహిమ ఉండడం వల్లే
ఏటా నాగపంచమి రోజూ వీళ్లు ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. కొండ మహేశ్వరి అమ్మవారి అండ ఉన్నంత వరకు తమకేమీ కాదని ఇక్కడి వారి విశ్వాసం. కేవలం తేళ్ల పంచమి రోజూ మాత్రమే ఇక్కడ ఏ రాయి కింద చూసినా తేలు ఉంటుందట. ఇక్కడో ఏదో మహిమ ఉండడం వల్లే తేలు కరిచినా ఏమీ కావడం లేదని భక్తుల నమ్మకం.



Click it and Unblock the Notifications











