Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Children's Day 2021:చిల్డ్రన్స్ డే గురించి ఈ విషయాలు తెలుసా...
మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గాఢంగా నమ్మారు. పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు.
నవంబర్ మాసం అంటేనే బాలలకు పండుగ మాసం. ఎందుకంటే ఈ నెల మొత్తం అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు, బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల హక్కుల రోజు. ఇలా ఈ నెల అంతా బాలలు పండగలా జరుపుకుంటారు. మన దేశంలోని పిల్లలంతా ఉత్సాహంగా ఉండే నెల ఏదైనా ఉందంటే అది నవంబర్ నెల అని అందరూ చెబుతారు.

నవంబర్ 14వ తేదీ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన జ్ఞాపకార్థం, పిల్లల సౌలభ్యం కోసం ఈరోజున బాలలకు కేటాయించారు. ఈ సందర్భంగా బాలలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నేటి బాలలే రేపటి పౌరులు..
మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గాఢంగా నమ్మారు. పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు. వారందరి అభివృద్ధి మన బాధ్యత అని తెలిపారు.

చాచాగా మారిన నెహ్రూ..
పండిట్ జవహార్ లాల్ నెహ్రూ పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తూ, వారితో ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాడు. అప్పటి పిల్లలు నెహ్రూను చాచా అని పిలిచేవారు. నెహ్రూకు ఇష్టమైన బిడ్డ అయిన చాచా ఆగియే అనే దాని గురించి అప్పట్లో అందరికీ తెలుసు. అందుకే పండిట్ నెహ్రూ పిల్లలకు ఎప్పుడూ చాచానే.

పిల్లలతోనే భవిష్యత్తు..
మన దేశ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లోనే ఉందని అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ సగర్వంగా ప్రకటన చేశారు. ‘‘నేటి బాలలే భారతదేశ ఆకృతిని అందంగా తయారు చేస్తారు. ఈరోజు మనం తీసుకువచ్చే విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది‘‘ అని నెహ్రూ తరచూ వివరించేవారు.

కళాశాలల స్థాపనలో నెహ్రూ కీలక పాత్ర..
పిల్లలకు విద్య విషయంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. పిల్లల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో కళాశాలల స్థాపనతో పాటు పలు విద్యా సంస్థల ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు. ఆయన అంత పట్టుదల పని చేశారు కాబట్టే నెహ్రూ విశ్వవిద్యాలయం ఇప్పటికీ దేశంలోని ఉత్తమ విద్యాసంస్థగా పరిగణించబడుతుంది.

పిల్లలకు అంకితం..
ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన నెహ్రూ 1964లో మరణించిన తర్వాత, అతడు జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఆయన పుట్టినరోజున అంటే నవంబర్ 14వ తేదీన పిల్లలకు అంకితం చేయబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మన దేశంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.

పిల్లలకు ఆటల పోటీలు..
బాలల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాల మరియు కళాశాలలో అనేక ఆటల పోటీలు నిర్వహిస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి కూడా నిర్వహిస్తారు. అలాగే ఆటలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న, మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక చాలా పాఠశాలల్లో మిఠాయిలు, పుస్తకాలను అందజేస్తారు.

నవంబర్ 20వ తేదీన..
మన దేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటే, ఐక్య రాజ్య సమితి నవంబర్ 20వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

తల్లిదండ్రులు ఏమి చేయాలంటే..
బాలల దినోత్సవం యొక్క ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి పిల్లల అభివృద్ధి. దేశంలోని ప్రతి బిడ్డకు విద్య అందేలా చూడాల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేందుకు తల్లిదండ్రులు చేయూత అందించాలి.

పిల్లలే పిల్లర్స్..
మన దేశాన్ని ఇంటిగా భావిస్తే.. దాన్ని అందంగా నిర్మించాలంటే పిల్లలే ప్రధాన పిల్లర్లు అని అందరూ గుర్తించాలి. ఎందుకంటే పిల్లర్లు, ఇటుకలతోనే భవనం అందంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే దేశంలోని సంస్కృతి, కళ, సాహిత్యం, సాంప్రదాయాలు మనుగడ సాగించాలంటే, ప్రతి వయోజన పిల్లవాడు సజీవంగా ఉండాలి. ప్రతి బిడ్డకు ఉత్తమ పోషక పునాది అందేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పని చేయాలి.
ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన నెహ్రూ 1964లో మరణించిన తర్వాత, అతడు జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఆయన పుట్టినరోజున అంటే నవంబర్ 14వ తేదీన పిల్లలకు అంకితం చేయబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మన దేశంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.
మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గాఢంగా నమ్మారు. పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు. వారందరి అభివృద్ధి మన బాధ్యత అని తెలిపారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే చాచాజీకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం.



Click it and Unblock the Notifications