Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Garuda Purana: లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఉదయం లేవగానే ఈ పనులు చేయండి
ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. బతకడానికైనా డబ్బు కావాల్సిందే. అయితే డబ్బు సంపాదించాలన్నా, సంపద సృష్టించాలన్న లక్ష్మీ దేవి కటాక్షం ఉండాల్సిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తుల ఇంట్లో ఐశ్వర్యం కొలువై ఉంటుంది.

గరుడ పురాణం ప్రకారం లక్ష్మీ దేవి కటాక్షం పొందాలన్నా, సంపద సృష్టించాలన్నా, ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలన్నా రోజూ ఉదయం నిద్ర లేవగానే కొన్ని కర్మలు చేయాలి. ఆయా పనులను రోజూ చేయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి రావడంతో లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. ఇంట్లోని సమస్యలు పరిష్కారమవుతాయి. రోగాలు తొలగిపోతాయి. దోషాలు నివారించబడతాయి. గరుడ పురాణం ప్రకారం రోజూ ఉదయం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దైవ, పితృదేవతల ఆరాధన
రోజూ ఉదయం పూజ చేసే ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు. గరుడ పురాణంలో ప్రతి వ్యక్తి పితృ దేవతలను పూజించాలి. క్రమం తప్పకుండా పితృదేవతలను పూజించడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే దేవారాధన వల్ల కూడా మంచి జరుగుతుంది. దీని వల్ల ఇంట్లోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పితృ దేవతలు, దేవుళ్లను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది.

2. స్నానం తర్వాతే వంట చేయాలి
గరుడ పురాణం ప్రకారం వంట గది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది. అందుకే వంట గదిలోకి ఉదయం స్నానం చేసిన తర్వాతే ఆహారం సిద్ధం చేయాలి. దానితో వంట చేసే ముందు వంటగదిలో ఏది వండినా పూజ గదిలో దేవుళ్లకు సమర్పించాలి. దీంతో లక్ష్మీ దేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది.

3. గ్రంథ పఠనం
ఇంట్లో దేవుళ్లను పూజించే సమయంలో మంత్ర పఠనం, గ్రంథ పఠనం చేయాలి. మత గ్రంథాలను చదవడం ద్వారా మంచి జరుగుతుంది. మనసు ఆధ్యాత్మికతో నిండిపోతుంది. ఇలా చేస్తే జీవితంలో సానుకూలతను తెస్తుంది. ఆదివారం మినహా ప్రతి రోజూ మత గ్రంథాలను పఠించాలి.

4. ఆవు, కుక్కకు మేత పెట్టాలి
ఇంట్లో ఆహారం వండితే మొదటి ముద్దను ఆవుకు, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. రోటీలు చేసుకుంటే మొదటి రోటీని ఆవుకు, చివరి రోటీని కుక్కకు తినిపించాలి. దీని వల్ల ఇంట్లో లక్ష్మీతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది.
గరుడ పురాణంలోని సూచన ప్రకారం మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పనులను తెల్లవారుజామున చేయడం వల్ల మన కష్టాలన్నీ నయమవుతాయని గరుడ పురాణం చెబుతోంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలంటే ఈ పనులను ఉదయం చేయాలని గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. ఈ పనులతో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. పేదవారికి, ఆకలితో అలమటించే వారికి తినడానికి ఏదైనా అందివ్వాలి.



Click it and Unblock the Notifications