Chanakya Niti: ఈ నాలుగు విషయాల్లో సిగ్గు, బిడియం పనికిరాదు, ఎందుకో చెప్పిన ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు మనిషి జీవితం గురించి చెబుతూ.. ఎవరైనా కొన్ని విషయాల్లో ఏమాత్రం సిగ్గు పడకూడదని, బిడియం పనికిరాదని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడు గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, వ్యూహకర్త, ఆర్థికవేతేత. మౌర్య సామ్రాజ్య రాజ సలహాదారు. చంద్రగుప్తుడిని రాజును చేయడంలో కీలక పాత్ర పోషించాడు చాణక్యుడు. చాణక్యుడు అర్థశాస్త్రం, చాణక్య నీతి అనే గ్రంథాలను రచించాడు. అందులో ధర్మబద్ధమైన, విజయవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎన్నో సూచనలు చేశాడు. చాణక్యుడు చెప్పిన సూచనలు నేటి కాలంలో కూడా ఆచరించడానికి అనువైనవి.

One should not be shy and show decency in these four things according to Chanakya Niti

చాణక్యుడు మనిషి జీవితం గురించి చెబుతూ.. ఎవరైనా కొన్ని విషయాల్లో ఏమాత్రం సిగ్గు పడకూడదని, బిడియం పనికిరాదని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానం చేస్తున్నప్పుడు:

దానం చేస్తున్నప్పుడు:

దానం చేయడం అనేది దయకు, దాతృత్వానికి ప్రతిరూపం. ఇది ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని చూపడంలో సహాయపడుతుంది. అయితే దానం చేస్తున్నప్పుడు, విరాళం అందిస్తున్నప్పుడు కొంత మంది సిగ్గు పడుతుంటారు. దానం చేయడానికి సంకోచిస్తుంటారు.

అయితే దానం చేస్తున్న సమయంలో సిగ్గుపడటం, బిడియపడటం చేయొద్దని చాణక్యుడు చెప్పాడు. దానధర్మాలు చేసేటప్పుడు మర్యాదను ప్రదర్శించాలని, దాని గురించి సిగ్గు పడకూడదని చాణక్యుడు సూచించాడు. అలా చేయడం ద్వారా, ఇతరులను కూడా దానం చేసేలా ప్రేరేపించవచ్చని చెప్పాడు.

యాగం చేయడం:

యాగం చేయడం:

పూర్వకాలంలో దేవతల దీవెనలు పొందేందుకు యాగాలు చేసే వారు. యాగాలు చేసే ఆచారం నేడు ఎక్కువగా లేకపోయినప్పటికీ శ్రేష్ఠమైన ప్రయోజనం కోసం యాగాలు చేయడం ఇప్పటికీ సత్కార్యంగా పరిగణించబడుతోంది. ఒక ఉదాత్తమైన ఉద్దేశం కోసం త్యాగం చేసేటప్పుడు సిగ్గుపడకూడదని, ఇతరులను కూడా అదే విధంగా ప్రేరేపించేలే మర్యాదను ప్రదర్శించాలని చాణక్య నీతి సూచిస్తోంది.

మాట్లాడుతున్నప్పుడు:

మాట్లాడుతున్నప్పుడు:

మానవ జీవితంలో కమ్యూనికేషన్ చాలా చాలా కీలకం. మన భావాలను, మన అవసరాలను తెలపడానికి కమ్యూనికేషన్ అవసరం. అయితే కొంతమంది ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు సిగ్గు పడుతుంటారు. బిడియంతో నోట మాటలు రావు.

కానీ ఒకరితో మాట్లాడుతున్న సమయంలో మర్యాదగా ప్రవర్తించాలని చాణక్యుడు చెప్పాడు. అర్థవంతంగా మాట్లాడాలని, స్పష్టంగా విషయం చెప్పాలని చాణక్యుడు చెప్పాడు. దీని వల్ల అపార్థాలకు తావు ఉండదని సూచించాడు. ఇది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని చెప్పాడు ఆచార్యుడు.

స్వప్రయోజనాల విషయంలో:

స్వప్రయోజనాల విషయంలో:

ఈ కాలంలో విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితం కావాలంటే ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకోవాలి. ఎవరి అవసరాల గురించి వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి స్వప్రయోజనాల విషయంలో సిగ్గు పడే వారు, ఎదుటి వారు ఏమనుకుంటారోనని అనుకునే వారు సంతృప్తికరమైన జీవితాన్ని గడపలేరు. మర్యాదపూర్వకంగా మాట్లాడుతూనే మన అవసరాలు తీర్చుకోవాలి.

Story first published: Friday, February 17, 2023, 19:30 [IST]
Desktop Bottom Promotion