Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సోషల్ మీడియాలో వైరల్ అయిన రాణు రాగం..
ఒక్కపాటతో వైరల్ అయిన రాణు అనే మహిళ.. అచ్చం లతామంగేష్కర్ లాగే ఆమె పాడుతోంది. బెంగాలీకి చెందిన ఈ గానకోకిల గురించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో బేబి పాడిన పాట ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెను ఇంటికి పిలిచి మరీ బహుమతులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. సంగీత దర్శకులు కోఠి సైతం ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చిన విషయం విదితమే. అదే తరహాలో ఇటీవల బెంగాల్ రాష్ట్రంలోని రాణా ఘాట్ అనే రైల్వేస్టేషన్లో పనిచేసే రాణు అనే మహిళ సరాదాగా పాడిన ఓ పాట వైరల్ అయ్యింది. "యే ప్యార్ కా నగ్మా హై" అంటూ ఆమె పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం లతామంగేష్కర్ పాడినట్టే పాడి అందరినీ మైమరిపిస్తోంది. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో ఆమె గురించి వెతకటం ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఎవరు.. ఎక్కడ ఉంటారు.. ఏమి చేస్తుంటారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అది పశ్చిమ బెంగాల్ లోని ఓ రైల్వేస్టేషన్.. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా గడుపుతుంటారు. అందరిలాగే ఆమె కూడా ఆరోజు తన పనిలో నిమగ్నమయ్యింది. రైల్వేస్టేషన్లో పని చేసే ఆ మహిళ అప్పుడే పని ముగించుకుని సరాదాగా ఓ పాట పాడింది. "యే ప్యార్ కా నగ్మా హై" అంటూ పల్లవి అందుకోగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. తొలుత లతా మంగేష్కరే అక్కడికొచ్చిందేమోనని అనుకున్నారు. కాస్త తేరుకుని చూస్తే రాణు మొండల్ ఓ సాధారణ మహిళ అచ్చం గానకోకిలలా పాడుతుంటే వారంతా పరవశించిపోయారు. అంతే వెంటనే ఆమె పాడిన పాటను వీడియోలో రికార్డు చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అది అంతగా వైరల్ అవుతుందని వారు కూడా ఊహించలేదు. కానీ అది కాస్త ఎవ్వరూ ఊహించనంతగా వైరల్ అయ్యింది. అంతే ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారిపోయారు. చాలా మంది ఆమె ఆచూకీని వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు ఆమె చిరునామా తెలుసుకున్న మీడియా వారు ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సినిమా వాళ్లు సైతం ఆమెకు అవకాశాలిస్తామని చెబుతున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటికే మీడియా ప్రతినిధులు రాణు దీదీతో ప్రత్యేక ఇంటర్వ్యూ సైతం తీసుకున్నారు. అంతేకాదు ఆమెతో సెల్ఫీలు దిగడానికి తెగ ఉత్సాహం చూపారు. ఇప్పటికీ సెల్ఫీల కోసం చాలామంది వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాణు మాట్లాడుతూ తాను సరాదాగా పాడిన ఆ పాట అంతలా వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదన్నారు. ఇప్పటికీ నాకు ఇంతలా పబ్లిసిటీ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఆ వీడియోను అప్ లోడ్ చేసిన టీమ్ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్న చందంగా ఎవరి లోపల ఏ టాలెంట్ ఉంటుందో తెలుసుకోవడం కష్టమే. పబ్లిసిటీ కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నా.. వారికి రాని పబ్లిసిటీ రాణు, బేబీ లాంటి వారికి అమాంతం పెరిగిపోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆమె గొంతు అచ్చం కోకిల పాట అంత మధురంగా ఉండటంతో ఆమెకు అనుకోకుండా అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇక త్వరలోనే ఈమెకు సినిమాలో పాడే ఛాన్సులు రానున్నాయి. సో తొందర్లోనే ఆమె సినిమాలలో పాటలు పాడి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.



Click it and Unblock the Notifications