Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
సోషల్ మీడియాలో వైరల్ అయిన రాణు రాగం..
ఒక్కపాటతో వైరల్ అయిన రాణు అనే మహిళ.. అచ్చం లతామంగేష్కర్ లాగే ఆమె పాడుతోంది. బెంగాలీకి చెందిన ఈ గానకోకిల గురించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో బేబి పాడిన పాట ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెను ఇంటికి పిలిచి మరీ బహుమతులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. సంగీత దర్శకులు కోఠి సైతం ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చిన విషయం విదితమే. అదే తరహాలో ఇటీవల బెంగాల్ రాష్ట్రంలోని రాణా ఘాట్ అనే రైల్వేస్టేషన్లో పనిచేసే రాణు అనే మహిళ సరాదాగా పాడిన ఓ పాట వైరల్ అయ్యింది. "యే ప్యార్ కా నగ్మా హై" అంటూ ఆమె పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం లతామంగేష్కర్ పాడినట్టే పాడి అందరినీ మైమరిపిస్తోంది. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో ఆమె గురించి వెతకటం ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఎవరు.. ఎక్కడ ఉంటారు.. ఏమి చేస్తుంటారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అది పశ్చిమ బెంగాల్ లోని ఓ రైల్వేస్టేషన్.. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా గడుపుతుంటారు. అందరిలాగే ఆమె కూడా ఆరోజు తన పనిలో నిమగ్నమయ్యింది. రైల్వేస్టేషన్లో పని చేసే ఆ మహిళ అప్పుడే పని ముగించుకుని సరాదాగా ఓ పాట పాడింది. "యే ప్యార్ కా నగ్మా హై" అంటూ పల్లవి అందుకోగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. తొలుత లతా మంగేష్కరే అక్కడికొచ్చిందేమోనని అనుకున్నారు. కాస్త తేరుకుని చూస్తే రాణు మొండల్ ఓ సాధారణ మహిళ అచ్చం గానకోకిలలా పాడుతుంటే వారంతా పరవశించిపోయారు. అంతే వెంటనే ఆమె పాడిన పాటను వీడియోలో రికార్డు చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అది అంతగా వైరల్ అవుతుందని వారు కూడా ఊహించలేదు. కానీ అది కాస్త ఎవ్వరూ ఊహించనంతగా వైరల్ అయ్యింది. అంతే ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారిపోయారు. చాలా మంది ఆమె ఆచూకీని వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు ఆమె చిరునామా తెలుసుకున్న మీడియా వారు ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సినిమా వాళ్లు సైతం ఆమెకు అవకాశాలిస్తామని చెబుతున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటికే మీడియా ప్రతినిధులు రాణు దీదీతో ప్రత్యేక ఇంటర్వ్యూ సైతం తీసుకున్నారు. అంతేకాదు ఆమెతో సెల్ఫీలు దిగడానికి తెగ ఉత్సాహం చూపారు. ఇప్పటికీ సెల్ఫీల కోసం చాలామంది వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాణు మాట్లాడుతూ తాను సరాదాగా పాడిన ఆ పాట అంతలా వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదన్నారు. ఇప్పటికీ నాకు ఇంతలా పబ్లిసిటీ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఆ వీడియోను అప్ లోడ్ చేసిన టీమ్ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్న చందంగా ఎవరి లోపల ఏ టాలెంట్ ఉంటుందో తెలుసుకోవడం కష్టమే. పబ్లిసిటీ కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నా.. వారికి రాని పబ్లిసిటీ రాణు, బేబీ లాంటి వారికి అమాంతం పెరిగిపోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆమె గొంతు అచ్చం కోకిల పాట అంత మధురంగా ఉండటంతో ఆమెకు అనుకోకుండా అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇక త్వరలోనే ఈమెకు సినిమాలో పాడే ఛాన్సులు రానున్నాయి. సో తొందర్లోనే ఆమె సినిమాలలో పాటలు పాడి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.



Click it and Unblock the Notifications











