Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
International Womens Day 2023: నాగాలాండ్లో తొలి మహిళ ఎమ్మెల్యేలు, ఒకే పార్టీ నుండి జయకేతనం, ఎవరంటే?
నాగాలాండ్ రాష్ట్ర హోదా పొంది ఇప్పటిక 60 ఏళ్లు అవుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నికవ్వలేదు. ఇప్పుడు హెకాని జఖాలు, సల్హౌతునో క్రుసె అనే ఇద్దరు మహిళలు తొలిసారిగా గెలిచిన మహిళా ఎమ్మెల్
నాగాలాండ్ రాష్ట్ర హోదా పొంది ఇప్పటిక 60 ఏళ్లు అవుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నికవ్వలేదు. ఇప్పుడు హెకాని జఖాలు, సల్హౌతునో క్రుసె అనే ఇద్దరు మహిళలు తొలిసారిగా గెలిచిన మహిళా ఎమ్మెల్యేలుగా నిలిచారు.

దిమాపుర్ నుండి హెకానీ, పశ్చిమ అంగామీ నుండి క్రుసె విజయం సాధించారు. వీరిద్దరూ నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ-NDPP అభ్యర్థులే కావడం విశేషం. హెకానీ 1,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా.. క్రుసె 7 ఓట్లతో జయకేతనం ఎగురవేశారు.

హెకాని జఖాలు ఎవరు?
హెకాని జఖాలు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం నుండి లా చదివారు. ఆ తర్వాత కొంత కాలం పాటు అమెరికాలోనే పని చేశారు. అనంతరం దిల్లీకి వచ్చి, న్యాయవాదిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత తన స్వరాష్ట్రం నాగాలాండ్ కు వెళ్లిపోయారు. యూత్ నెట్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు హెకాని జఖాలు.
యూత్ నెట్ ద్వారా యువతకు వివిధ అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని ద్వారా 23,500 మంది లబ్ధి పొందారు. యువత, మహిళ సాధికారత కోసం హెకాని జఖాలు ఎంతో కృషి చేశారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో నారీ శక్తి పురస్కారం ఇచ్చి గౌరవించింది.

సల్హౌతునో క్రుసె ఎవరు?
- సల్హౌతునో క్రుసె ఒక హోటల్ యజమాని.
- నాగాలాండ్ ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో 56 ఏళ్ల క్రుసె ఒకరు.
- సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లో చురుకునై సభ్యురాలిగా ఉన్నారు.
- పలు స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేశారు.
- స్థానిక అంగమిమియాప్ఫు మెచు క్రోతో అనే స్థానిక తెగ మహిళలకు నాయకత్వం వహించారు.
- సల్హౌతునో క్రుసెకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో మద్దతు ఇచ్చారు.
- స్వతంత్ర అభ్యర్థి కెనీఝాఖో నఖ్రోపై క్రుసె పోటీ చేశారు. నఖ్రోకు 7071 ఓట్లు రాగా, క్రుసెకు 7078 ఓట్లు వచ్చాయి.
1963 సంవత్సరంలో నాగాలాండ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుండి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. నాగాలాండ్ లో మొత్తం 13.17 లక్షల ఓట్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లే 6.56 లక్షల మంది ఉంటారు. ఇప్పటి వరకు 20 మంది మహిళలు పోటీ చేసినప్పటికీ వారెవరు గెలుపొందలేరు.



Click it and Unblock the Notifications