Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఢిల్లీలో తొక్కిసలాట కారణం అదే.. అఫీషియల్గా ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే?
దేశ రాజధాని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే వందలాది మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాజ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు 14వ ప్లాట్ఫాంపై ఉండగా, కుంభమేళా కోసం వచ్చే భక్తులు అక్కడ చేరుకున్నారు. అదే సమయంలో, స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం అయ్యాయి.

దీంతో ప్లాట్ఫాం 12, 13, 14 కూడా నిండిపోయాయి. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పదుల సంఖ్యలో మందికి గాయాలు అయ్యాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రధాని దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ మరియు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఘటనలో మృతులు సంభవించాయని ధ్రువీకరించారు. రైల్వే ప్రాధికారులు, ఈ రద్దీని ముందుగానే అంచనా వేశామని చెప్పారు, కానీ ఈ ఘటన క్షణాల్లో జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై విస్తృత విచారణ చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications