Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
శనిదోషం తొలగిపోవాలంటే.. శనివారం రోజు ఈ శని మంత్రాన్ని పఠించండి
చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అన్నీ బాగున్నా కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురవుతాయి. దాని వల్ల జీవితం అంతా కష్టాలమయం అవుతుంది. కొందరు చేతినిండా సంపాదిస్తారు. కానీ అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులతో చేతిలో రూపాయి కూడా నిలవదు. మరికొందరు బాగానే సంపాదిస్తారు.. కానీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలతో డబ్బు ఉన్నా, ప్రశాంతత లేక ఇబ్బంది పడిపోతారు.
జీవితంలో శనిదోషం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. అన్నీ బాగుంటాయి కానీ చిన్న చిన్న సమస్యలే జీవితాన్ని అధోఃగతి పాలు చేస్తాయి. డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇలాంటి సమస్యలకు శనిదోషమే కారణం. జీవితంలోని సమస్యలు తొలగిపోవడానికి, జీవితం సాఫీగా, ఆనందంగా సాగడానికి శనివారం రోజు శనికి సంబంధించిన ఈ మంత్రాన్ని పఠించాలి. శని సాడే సతీ మంత్రం జపించడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. మరి శని సాడే సతీ మంత్రి ఎలా జపించాలంటే..

శని సాడేసతి మంత్రం:
హ్రీం ఓం నమః శివాయ హ్రీం
సాడేసతి నివారణ మంత్రాన్ని ఎలా పఠించాలంటే..
సాడేసతి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమం సమయం శనివారం తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు లేదా సాయంత్రం సూర్యస్తమయం ఈ మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయంగా చెబుతారు. అలాగే మంత్రం పఠించే సమయంలో తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే మంత్రాన్ని పఠించే ముందు గణేషుడిని ప్రార్థించాలి. దీపం వెలిగించాలి. మనసులో శివుడిని స్మరించుకోవాలి. రుద్రాక్షి జపమాల పట్టుకుని సాడే సతి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత పూల చెట్లకు నీరు పోసి నమస్కరించాలి.
దానం చేయడం, నలుగురికి భోజనం పెట్టడం కూడా..
పేదలకు, అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. తోచినంత సాయం చేసి ఫలితం ఆశించకూడదు. అలాగే ఈ రోజు బ్రహ్మణులకు నలుపు రంగు వస్తువులు దానం చేయాలి. లేదంటే డబ్బు దానం చేయాలి. నల్ల దుప్పటి, నల్లని నువ్వులు, నల్లని బూట్లు దానం చేయడం వల్ల జీవితంలో శని దోషం తొలగిపోతుంది.
నల్ల ఆవులకు బెల్లం, నానబెట్టిన శనగలు..
ఈ రోజు నల్ల ఆవులకు బెల్లం, నానబెట్టిన శనగల ఆహారం ఇవ్వడం వల్ల దోష తొలగిపోతుంది. అలాగే శనివారం నలుపు రంగు ఇతర జంతువులకు కూడా ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం తొలగిపోతుంది.
ఇలా చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది..
పుష్య నక్షత్రం రోజు శని దేవునికి కొబ్బరి, అరటి, నల్ల నువ్వులు, గొడుగు, ఇనుము, నూనె, నల్లని వస్త్రం వంటివి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని దేవును కృప కలుగుతుంది. దోషం తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications