Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
షాకింగ్..టాయిలెట్ సీటు పేలి యువకుడికి తీవ్ర గాయాలు!
ఈ బిజీ లైఫ్ లో ప్రశాంతంగా ఉండేది బాత్రూమ్ లోనే అంటూ తరచుగా చాలామంది జోక్స్ వేసుకుంటుంటారు. అయితే బాత్రూమ్ కి వెళ్లడం ఓ వ్యక్తికి పీడకలలా మారింది. అతను కూర్చున్న టాయిలెట్ సీట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతనికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. టాయిలెట్ సీటు పేలడం ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సిటీలోని సెక్టార్ 36లో అషు అనే 20 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఎప్పటిలానే అషు బాత్రూమ్ కి వెళ్లి టాయిలెట్ సీటు మీద కూర్చున్నాడు. అయితే ఉన్నట్లుండి అది బ్లాస్ట్ అయ్యింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు అషుని వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(GIMS)కు తరలించారు. అషుకి 35శాతం కాలిన గాయాలు అయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అయితే బాత్రూమ్ కి వెళ్లిన టైంలో అషు ఫోన్ కానీ లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడలేదని ఆషు తండ్రి సునీల్ ప్రధాన్ చెబుతున్నారు. బాత్రూమ్ లో పేలుడు ఎలాంటి గాడ్జెట్స్ కారణం కాదని..కేవలం టాయిలెట్ సీటు మాత్రమే బ్లాస్ట్ అవడం తమను కూడా షాక్ కు గురిచేసినట్లు ఆయన తెలిపారు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడుకు ఎటువంటి విద్యుత్ సమస్య కారణం కాలేదు. ఆ సమయంలో ఇంట్లో ఏసీ, ప్రతి ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ బాగానే పనిచేస్తున్నాయి.. కానీ ఊహించని విధంగా మీథేన్ వాయువు పేరుకుపోవడం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. టాయిలెట్ సీటు లోపల పేరుకుపోయిన మురుగుకాలవ మూసుకుపోవడం వల్లే ఇలా జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా వస్తాయని..ముఖ్యంగా పాతబడిన లేదా సరిగ్గా మెయింటెన్స్ లుని ప్లంబింగ్ సిస్టమ్స్ ఉన్న ఇళ్లలో ఇలాంటి పేలుడులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పైపులు చాలా పాతవిగా ఉండి, చాలా ఏళ్లుగా వాటిని క్లీన్ చేయకుంటే.. మూసుకుపోయిన పైపులు గ్యాస్ పేరుకుపోవడానికి దారితీస్తాయని..ఇది ఒత్తిడిలో పేలిపోయే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
డ్రైనేజీలు మూసుకుపోయినప్పుడు లేదా వెంటిలేషన్ సరిపోనప్పుడు పరిమిత బాత్రూమ్ స్థలం,మురుగునీటి కాలవల్లో మీథేన్ పేరుకుపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇంటి ఓనర్స్ తమ పాత ఇల్లలోని పంబ్లింగ్ సిస్టమ్ ను ప్రమాదకరమైన వాయువు పేరుకుపోకుండా ఉండటానికి తరచుగా క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications