Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
షాకింగ్..టాయిలెట్ సీటు పేలి యువకుడికి తీవ్ర గాయాలు!
ఈ బిజీ లైఫ్ లో ప్రశాంతంగా ఉండేది బాత్రూమ్ లోనే అంటూ తరచుగా చాలామంది జోక్స్ వేసుకుంటుంటారు. అయితే బాత్రూమ్ కి వెళ్లడం ఓ వ్యక్తికి పీడకలలా మారింది. అతను కూర్చున్న టాయిలెట్ సీట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతనికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. టాయిలెట్ సీటు పేలడం ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సిటీలోని సెక్టార్ 36లో అషు అనే 20 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఎప్పటిలానే అషు బాత్రూమ్ కి వెళ్లి టాయిలెట్ సీటు మీద కూర్చున్నాడు. అయితే ఉన్నట్లుండి అది బ్లాస్ట్ అయ్యింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు అషుని వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(GIMS)కు తరలించారు. అషుకి 35శాతం కాలిన గాయాలు అయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అయితే బాత్రూమ్ కి వెళ్లిన టైంలో అషు ఫోన్ కానీ లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడలేదని ఆషు తండ్రి సునీల్ ప్రధాన్ చెబుతున్నారు. బాత్రూమ్ లో పేలుడు ఎలాంటి గాడ్జెట్స్ కారణం కాదని..కేవలం టాయిలెట్ సీటు మాత్రమే బ్లాస్ట్ అవడం తమను కూడా షాక్ కు గురిచేసినట్లు ఆయన తెలిపారు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడుకు ఎటువంటి విద్యుత్ సమస్య కారణం కాలేదు. ఆ సమయంలో ఇంట్లో ఏసీ, ప్రతి ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ బాగానే పనిచేస్తున్నాయి.. కానీ ఊహించని విధంగా మీథేన్ వాయువు పేరుకుపోవడం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. టాయిలెట్ సీటు లోపల పేరుకుపోయిన మురుగుకాలవ మూసుకుపోవడం వల్లే ఇలా జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా వస్తాయని..ముఖ్యంగా పాతబడిన లేదా సరిగ్గా మెయింటెన్స్ లుని ప్లంబింగ్ సిస్టమ్స్ ఉన్న ఇళ్లలో ఇలాంటి పేలుడులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పైపులు చాలా పాతవిగా ఉండి, చాలా ఏళ్లుగా వాటిని క్లీన్ చేయకుంటే.. మూసుకుపోయిన పైపులు గ్యాస్ పేరుకుపోవడానికి దారితీస్తాయని..ఇది ఒత్తిడిలో పేలిపోయే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
డ్రైనేజీలు మూసుకుపోయినప్పుడు లేదా వెంటిలేషన్ సరిపోనప్పుడు పరిమిత బాత్రూమ్ స్థలం,మురుగునీటి కాలవల్లో మీథేన్ పేరుకుపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇంటి ఓనర్స్ తమ పాత ఇల్లలోని పంబ్లింగ్ సిస్టమ్ ను ప్రమాదకరమైన వాయువు పేరుకుపోకుండా ఉండటానికి తరచుగా క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications