Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బ్యాంకాక్ లో సునామీ వస్తుందా? అల్లకల్లోలం..భయంతో జనం పరుగో పరుగు,వీడియోలు చూడండి
యమన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నాం 12: 50 సమయంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. సంగైంగ్ సిటీకి 16 కిలోమీటర్ల దూరంలో భూమిలోపల 10 కి.మీ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రతకు మండలేలో ఇర్రవడ్డీ నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కూలిపోయింది.
మరోవైపు, బ్యాంకాక్ లో కూడా 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. ఉత్తర థాయిలాండ్ మొత్తం భూప్రకంపనలు వచ్చాయి. పలుచోట్ల భవనాలు కూలిపోయాయి. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవనాలు ఊగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల బిల్డింగ్ పై అంతస్థులోని స్విమ్మంగ్ పూల్ లోని వాటర్ కిందకు పడుతున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భూకంపం నేపథ్యంలో బ్యాంకాక్ లో భవనాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.

థాయిలాండ్ ప్రధాని దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. సునామీ హెచ్చరికలు ఇప్పటివరకైతే జారీ చేయలేదు. మరోవైపు ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు జరిగిన ప్రాణ,ఆస్తి నష్టంపై ఇంకా వివరాలను అధికారులు వెల్లడించలేదు. మయన్మార్, బ్యాంకాక్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
బ్యాంకాక్, యయన్మార్ ఎఫెక్ట్ తో భారత్, బంగ్లాదేశ్,లావోస్,చైనాలో కూడా భూకంపం వచ్చింది. మనదేశంలో ఢిల్లీ, కోల్ కతా,మణిపూర్,మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి.



Click it and Unblock the Notifications