Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
2025లో ప్రపంచం అంతం అవడం ఖాయం.. కావాలంటే ఇదిగో ప్రూఫ్.. సంచలన విషయాలు చెప్పిన బాబా వంగ
'త్వరలో యుగాంతం' ఈ మాట ఇప్పటి నుంచి వింటున్నది కాదు. 2012లో డిసెంబర్ 31న ప్రపంచం అంతమైపోతుందని ఓ పుకారు పుట్టింది. అప్పటి నుంచి ఈ పుకారు కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇప్పుడు ఆ పుకారు కాస్త నిజమవ్వబోతోందని ప్రముఖ బాబా వంగా చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు భవిష్యత్తుకు సంబంధించి ఆమె ఎన్నో విషయాలను తాజాగా పంచుకున్నారు. అవేంటో కింద ఇచ్చాము చదవండి
అసలు ఎవరీ బాబా వంగా:
బాబా వంగ అసలు పేరు.. వాంజెలియా పాండేవా గుష్టెరోవా. ఆమె 9/11 ఉగ్రదాడులు, 2022లో యూకేలో సంభవించిన వరదలను ముందుగానే పసిగట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. దీంతో పలు ఉపత్తులను, ముందుగానే పసిగట్టడంతో ఆమె మాటలకు, ఊహాగానాలకు బలం చేకూరాయి.

బాబా వంగా భవిష్యత్తు గురించి ఏం చెప్పారంటే?
2025లో ఐరోపా ఖండంలో ఒక సంఘర్షణ పుట్టుకొస్తుందని, ఆ సంఘర్షణ కారణంగా వేలాది మంది మరణిస్తారు తెలిపారు. అక్కడి నుంచే ప్రపంచం అంతానికి అసలైన బీజం పడుతుందని, అదే యుగాంతానికి కారణమయ్యే అవకాశముందని తెలిపింది.
2028లో భూమి మీద ఉన్న వనరులు ముగిసే సమయం ఆసన్నమైందని గ్రహించిన మానవులు శుక్ర గ్రహంపై అన్వేషణ మొదలుపెడతారని, అయితే ఆ గ్రహంపై వాతావరణం అనుకూలించకపోవడంతో అది జరగదని పేర్కొన్నారు.
2033.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంవత్సరమని, ఈ సంవత్సరం.. ఆర్కిటిక్, అంటార్కిటిక్లోని మంచు గడ్డలు కరిగి.. సముద్రంలో పడతాయని, తద్వారా సముద్రపు మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశముందన్నారు.
2076లో కమ్యూనిజం తిరిగి వస్తుందని వంగా బాబా అంచనా వేశారు. అయితే ఈసారి కేవలం సోవియట్ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఇది విస్తరిస్తుందని అన్నారు.
2130 నాటికి మనం గ్రహాంతర వాసులతో పరిచయం పెంచుకోబోతున్నామని, ఇది మానవ మనుగడను మరొక స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు.
2170 సంవత్సరం నాటికి భూమిపైనా వాతావరణం మొత్తం కలుషితమవుతుందని, తద్వారా భూగ్రహం మొత్తం కరువు తాండవిస్తుంది అన్నారు.
3005 సంవత్సరంలో మానవులకు, గ్రహాంతర వాసులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని, వారితో యుద్ధానికి మానవులు అంగారక గ్రహానికి వెళ్తారని చెప్పారు
3797వ సంవత్సరం నాటికి భూగ్రహం మీద మానవులు ఉండరని, వారు వేరే గ్రహానికి వెళ్తారని చెప్పారు. భూమి మీద వాతావరణం నాశనం అవడంతో పాటు.. కరువు తాండవిస్తుండడంతో వారు వేరే గ్రహానికి వెళ్ళాక తప్పదన్నారు.
5079వ సంవత్సరంలో ఈ యుగం ముగుస్తుందని, ఆ సంవత్సరంతో ప్రపంచం మొత్తం అంతం అవుతుందని, మానవ మనుగడే ఈ విశ్వంలో ఉందని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications











