దొంగతనానికి వచ్చి.. పోలీసులు వచ్చే వరకు ఏసీలో నిద్రపోయిన అలసిన దొంగ..!

అందరు దొంగలూ ఒకేలా వుండరు. అందరూ ప్రొఫెషనల్స్ కాదు. దొంగతనం చేయడానికి వచ్చి టిఫిన్ చేస్తూ పట్టుబడ్డం, మందు తాగుతూ పట్టుబడ్డం, ఇలాంటి కేసులను మనం చూస్తూనే వున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏసీలో నిద్ర చోటెరగద అన్నట్టు మత్తుగా నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలో, ఫోటోల సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయ్.

దేశంలో అనేక చోట్లు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న విషయంగా తెలిసిందే. ఏసీ రూముల్లు ఇప్పుడు స్వర్గాలుగా మారయ్. మండే ఎండలోంచి ఏసీలోకి వెళ్లగానే అప్పటివరకున్న వేడి మొత్తం ఎగిరిపోయ్ గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది.

లక్నోలని ఇందిరా నగర్‌లో ఆదివారంలో ఒక దొంగ ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో దోచుకోవడానికి ఏ వస్తువులూ లేకపోవడంతో ఏసీ రూంలోకి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడో ఏమో రూంలోపలికి వెళ్లి ఏసీ ఆన్ చేసి. ఇంటి గేటు, తలుపులు తెరిచి వుంచడాన్ని పక్కఇంటి వారు గమనించారు. వెంటనే వారణాసిలో వున్న ఇంటి ఓనర్‌కు ఫోన్ చేశారు. పోలీసులు ఇంటి వద్దకు వచ్చేసరికి దొంగ ఏసీ రూంలోఇంకా నిద్రపోతూనే వున్నాడు. షర్ట్ తీసి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని దీర్ఘంగా నిద్రపోతున్న దృష్యాన్ని పోలీసులు కెమెరాలో బంధించారు. పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేసి అతనిపై ఐపీసీ సెక్షన్ 379ఏ కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ ఇంటిలోని వాష్ బేసిన్‌ను, నీళ్ల పంప్‌ను, గ్యాస్ సిలిండర్‌ను, డబ్బును దొంగలించడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.

thief-enters-house-for-theft-in-lucknow-but-slept-under-ac-untill-polices-comes-and-wakes-him-up

నిద్రిస్తున్న ఈ దొంగకు సంబంధించిన ఫోటోలు వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. దొంగలు పట్టుబడాలంటే ఏసీ ఆన్‌లో వుంచాలి అని అన్నాడు. ఏసీ కొనుక్కుంటే ఎన్ని ఫలితాలో తెలుసా అని మరో యూసర్ కామెంట్ చేశాడు. అది ఏ కంపెనీ ఏసీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రధాన మంత్రి అందరి ఇళ్లల్లో ఏసీ పెట్టిస్తే దొంగలు పట్టుబడతారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సంఘటనపై అందరూ నెటిజెన్లు ఏసీ వల్లే దొంగ పట్టుబడ్డాడని కామెంట్ చేస్తున్నారు. ఖచ్ఛితంగా ఇందుకోసమైనా ఏసీ కొనాల్సిందేనని కామెంట్లు చేయడం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.

అందరు దొంగలూ ఒకేలా వుండరు. అందరూ ప్రొఫెషనల్స్ కాదు. దొంగతనం చేయడానికి వచ్చి టిఫిన్ చేస్తూ పట్టుబడ్డం, మందు తాగుతూ పట్టుబడ్డం, ఇలాంటి కేసులను మనం చూస్తూనే వున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏసీలో నిద్ర చోటెరగద అన్నట్టు మత్తుగా నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలో, ఫోటోల సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయ్.

దేశంలో అనేక చోట్లు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న విషయంగా తెలిసిందే. ఏసీ రూముల్లు ఇప్పుడు స్వర్గాలుగా మారయ్. మండే ఎండలోంచి ఏసీలోకి వెళ్లగానే అప్పటివరకున్న వేడి మొత్తం ఎగిరిపోయ్ గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది.

లక్నోలని ఇందిరా నగర్‌లో ఆదివారంలో ఒక దొంగ ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో దోచుకోవడానికి ఏ వస్తువులూ లేకపోవడంతో ఏసీ రూంలోకి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడో ఏమో రూంలోపలికి వెళ్లి ఏసీ ఆన్ చేసి. ఇంటి గేటు, తలుపులు తెరిచి వుంచడాన్ని పక్కఇంటి వారు గమనించారు. వెంటనే వారణాసిలో వున్న ఇంటి ఓనర్‌కు ఫోన్ చేశారు. పోలీసులు ఇంటి వద్దకు వచ్చేసరికి దొంగ ఏసీ రూంలోఇంకా నిద్రపోతూనే వున్నాడు. షర్ట్ తీసి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని దీర్ఘంగా నిద్రపోతున్న దృష్యాన్ని పోలీసులు కెమెరాలో బంధించారు. పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేసి అతనిపై ఐపీసీ సెక్షన్ 379ఏ కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ ఇంటిలోని వాష్ బేసిన్‌ను, నీళ్ల పంప్‌ను, గ్యాస్ సిలిండర్‌ను, డబ్బును దొంగలించడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.

నిద్రిస్తున్న ఈ దొంగకు సంబంధించిన ఫోటోలు వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. దొంగలు పట్టుబడాలంటే ఏసీ ఆన్‌లో వుంచాలి అని అన్నాడు. ఏసీ కొనుక్కుంటే ఎన్ని ఫలితాలో తెలుసా అని మరో యూసర్ కామెంట్ చేశాడు. అది ఏ కంపెనీ ఏసీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రధాన మంత్రి అందరి ఇళ్లల్లో ఏసీ పెట్టిస్తే దొంగలు పట్టుబడతారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సంఘటనపై అందరూ నెటిజెన్లు ఏసీ వల్లే దొంగ పట్టుబడ్డాడని కామెంట్ చేస్తున్నారు. ఖచ్ఛితంగా ఇందుకోసమైనా ఏసీ కొనాల్సిందేనని కామెంట్లు చేయడం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.

Story first published: Tuesday, June 4, 2024, 14:28 [IST]
Desktop Bottom Promotion