Yadadri Helicopter: యాదాద్రిలో కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెంత కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు జరిగాయి. హైదరాబాద్ ఎయిర్‌లైన్స్‌ ప్రైవేటే లిమిటెడ్ తరఫున ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు కొత్త హెలికాప్టర్ కొన్నారు.

Yadadri Helicopter: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెంత కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు జరిగాయి. హైదరాబాద్ ఎయిర్‌లైన్స్‌ ప్రైవేటే లిమిటెడ్ తరఫున ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు కొత్త హెలికాప్టర్ కొన్నారు. ఈ హెలికాప్టర్‌ను వాహన పూజ కోసం యాదాద్రికి తీసుకువచ్చారు. యాదాద్రి టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద నూతన హెలికాప్టర్‌కు ఆలయ అర్చకులు పూజలు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో కలిసి ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు హెలికాప్టర్ వద్ద కొబ్బరి కాయ కొట్టి వాహన పూజ చేశారు.

yadadri helicopter

యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇది కొత్తేం కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు మొదటిసారిగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో వాహన పూజ నిర్వహించారు. అప్పట్లో ఆ హెలికాప్టర్‌కు స్వామి వారి పేరునే పెట్టారు.

ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాస రావు కొనుగోలు చేసిన హెలికాప్టర్ పేరు ఎయిర్ బస్ ACH 135. దీని రేంజ్ 500 కిలోమీటర్లు. 20 వేల ఫీట్ల ఎత్తు వరకు వెళ్లగలదు. దీని ధర 5.7 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 47 కోట్లు. దీనికి పన్నులు అదనం.

Desktop Bottom Promotion