Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
రామోజీరావు గురించి ఎవ్వరికీ తెలియని ఈ విషయాలు మీకు తెలుసా..?
ఈనాడు వ్యవస్థాపకులు, పారిశ్రామిక వేత్త రామోజీరావు మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈనాడుతో తన కెరీర్ను ప్రారంభించి అంచెలంచెలుగూ ఎదుగుతూ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. ఆయన గురించి సీనియన పాత్రికేయులు, మేధావులు, రాజకీయ నాయకులు ఎందరో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
రామోజీరావు గురించి ఆసక్తికరమైన విషయాలు
రామోజీరావు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని అంటున్నారు. రామోజీ రావు ఏ సినిమా తీసినా అందులో సామాజిక స్పృహ, సామాజిక సందేశం ఖచ్ఛితంగా వుంటుంది. వ్యాపారంలో కూడా సామాజిక బాధ్యతను చూసేవారని మేధావులు చెబుతున్నారు.

రామోజీరావు నోటి నుంచి అనవసర పదం కానీ వాక్యం కానీ వచ్చేది కాదని అంటున్నారు. ఏది మాట్లాడినా కారణంతో వుంటుందని అంటున్నారు. అనవసరమాటలు, జోకులు ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదు.
తెలుగు భాషపైన ఆయనకు మక్కువ ఎక్కువగా వుండేది. తెలుగు పత్రికలో ఆంగ్ల పదం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విషయంలో క్రమశిక్షణతో నడుచుకోవడం కేవలం రామోజీరావుకే సాధ్యం.
మహాభారతాన్ని హాలీవుడ్లో రామోజీ ఫిలింసిటీలో షూట్ చేయించాలని అనుకున్నారు. గంటన్నర సినిమాలో మొత్తం 18 పర్వాలు వచ్చే విధంగా హాలీవుడ్ స్క్రిప్ట్ను కూడా రెడీ చేయించారు.

తన ఉషాకిరణ్ బ్యానర్లో ఇప్పటి వరకు 95 సినిమాలు చేసారు, వంద సినిమాలు తీయాలనుకున్నారని చెబుతుంటారు. కుటుంబ కథా చిత్రాలు ఈ రోజుల్లో రావడం లేదు కాబట్టి మంచి కథ వుంటే సినిమా తీద్దామని రాయోజీరావు చివరి దశలో అనుకున్నారు.
రామోజీరావు స్థాపించిన ఈనాడు ఆగస్టు 2024 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ వేడుకను ఒక పెద్ద పండగలా చేయాలని రామోజీరావు భావించారు. కానీ అది కలగానే మిగిలిపోయింది.
నూతన దర్శకులను, నూతన నటులను ఎంతో మందిని రామోజీరావు పరిచయం చేసి ప్రోత్సహించారు. దర్శకుడు తేజ, నటుడు ఉదయ్కిరణ్ను చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. హీరో తరుణ్ని కూడా నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్కు పరిచయం చేశారు. రీమాసేన్, రిచా, శ్రెయ, జూనియర్ ఎన్టీఆర్ను కూడా రామోజీరావు పరిచయం చేశారు.
రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఓం స్పిరిచువల్ సిటీ అనే ఆధ్యాత్మిక నగరాన్ని కూడా రామోజీరావు నిర్మించాలనుకున్నారు. ఈ ఆధ్యాత్మిక నగరంలో 108 ప్రముఖ దేవాలయాల నమూనాలను నిర్మించాలని ఆయన కోరిక.
రామోజీరావు మొదట్లో చిట్ఫండ్ల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తరువాత అన్నదాత అనే రైతు మ్యాగజైన్ను 1969లో ప్రారంభించారు.
1984లో శ్రీవారి ప్రేమలేఖ చిత్రంతో ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో అడుగుపెట్టారు. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళ్ భాషల్లో రామోజీ రావు సినిమాలను నిర్మించారు.
తన రాజకీయ ప్రత్యర్ధి అయిన సీఎం జగన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం చూసి చాలా సంతోషించారని. తన చివరి దశలో ఇది అత్యంత సంతోషకరమైన విషయమని సన్నిహితులు చెబుతున్నారు.
సీనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, రాష్ట్రంలో ఆ పార్టీ విజయానికి రామోజీరావుకు చెందిన ఈనాడు పత్రిక కీలక పాత్ర పోషించిందని అంటున్నారు.
మీడియాలో ఆయన చేసిన సేవలకు గాను 2016లో ఆయనకు పద్మవిభూషన్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహూకరించారు.



Click it and Unblock the Notifications