Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
Manmohan singh: మన్మోహన్ సింగ్ గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సంచలన నిజాలు!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషయం తెలిసిందే. భారత దేశానికి రెండు ప్రధాన మంత్రిగా ఒకసారి ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఆయన.. భారత దేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. ఎన్నో ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన ఆయన భారత దేశం కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన మృతిపట్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రతి ఒక్కరూ ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. అయితే ప్రధాన మంత్రిగానే కాకుండా ఎన్నో పదవులు చేపట్టిన ఆయన గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి తెలియని ఆసక్తికర విషయాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పని చేశారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పని చేసి ఆర్ధిక మంత్రిగా అయ్యింది కేవలం ఇద్దరు మాత్రమే వారిలో ఒకరు మన్మోహన్ సింగ్ కావడం విశేషం.

ఆర్ధిక మంత్రులుగా పని చేసి, ప్రధానులుగా అయ్యింది చరిత్రలో నలుగురు మాత్రమే ఉన్నారు. వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. మిగిలిన వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీ.వీ.సింగ్ కూడా ఉన్నారు.
మన దేశానికి ఇప్పటి వరకు నలుగురు దౌత్యవేత్తలు మాత్రమే ఆర్ధిక మంత్రులుగా నియమితులయ్యారు. వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.
మన్మోహన్ సింగ్ ప్రసంగాలు ఎప్పుడూ ఉర్దూలోనే రాసేవారు. మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడినప్పటికీ, భాషలో ఆయనకున్న ప్రావిణ్యం కారణంగా ఆయన ప్రసంగాలను ఉర్దూలో ఉండేవి. ఉర్దూలోనే చదివేవారు.
మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ఉన్న పాకిస్థాన్లో పుట్టారు. ఆయన 14 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. దీని కారణంగా మన్మోహన్ సింగ్, ఆయన కుటుంబం పంజాబ్లోని అమృత్సర్కు తరలి వచ్చింది. ఇప్పటికీ మన్మోహన్ సింగ్కు పాకిస్థాన్లో ఇల్లు ఉందని చెప్పుకుంటారు.
మన్మోహన్ సింగ్ చిన్నతనంలో చదువుకోవడానికి కొన్ని మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేది. చదువుకోవడానికి లైట్స్ లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేందుకు కొన్ని మైళ్ళ దూరం వరకు నడవాల్సి వచ్చేదట.
2004లో మన్మోహన్ సింగ్ భారత దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పటి వరకు భారత దేశానికి ప్రధాని అయిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్ కావడం విశేషం. ఆయన ఒకరికే ఈ ఘనత దక్కింది.
మన్మోహన్ సింగ్ తన జీవితంలో ఎన్నో స్థానాల్లో విధులు నిర్వర్తించారు. లెక్చరర్ స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారు. లెక్చరర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి, ఆర్ధిక మంత్రి, గవర్నర్, ప్రధాని ఇలా ఎన్నో పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించారు.
మన్మోహన్ సింగ్కు అరుదైన ఘనతలు కూడా ఉన్నాయి. 1993లో ఆయన యూరోమని, ఆసియామనీ "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచారు. ఇది ఆయన సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.



Click it and Unblock the Notifications