వైకుంఠ ఏకాదశి 2023, తేదీ, ఉపవాస సమయం, శుభ ముహూర్తం, తిథి, ప్రాముఖ్యత

వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందుకే ఈరోజు శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం.

హిందూ పంచాంగ ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు మహా విష్ణువు పూజిస్తారు. ఈ రోజునాడు కలియుగ దైవానికి అంకితం చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి కూడా పవిత్రమైనదే. అయితే ఇందులో వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.

vaikunta ekadashi 2023

ఈరోజు శ్రీ మహావిష్ణువు సర్వాలంకార భూషితుడై వైకుంఠంలో ఉత్తర ద్వారం వద్దకు రాగా అక్కడ సకల దేవతలు ఆయనను సేవిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అందువల్ల ఈరోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందుకే ఈరోజు శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం.

వైకుంఠ ఏకాదశి తేదీ, సమయం:

వైకుంఠ ఏకాదశి తేదీ, సమయం:

  • ఏకాదశి తిథి ప్రారంభం - జనవరి 1, 2023 - 7.11PM
  • ఏకాదశి తిథి ముగింపు - జనవరి 2, 2023 - 8.23PM
  • వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత:

    వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత:

    సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువును దర్శించుకుంటారు. మహా విష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండు పుట్టాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజే శివుడు హాలాహలం గొంతులో దాచి అమృతం ఇవ్వగా.. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని అంటారు. ఈరోజునే భీష్ముడు కూడా మరణించాడని అందుకే దీనిని భీష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

    ఏకాదశి ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా శుభ్రపరిచేంత శక్తివంతమైనదని కూడా నమ్ముతారు. ఇది శరీరానికి, ఆత్మకు అపారమైన శాంతిని ఇస్తుంది. పాపాలను అన్నింటిని మహావిష్ణువు తొలగిస్తారని నమ్ముతారు.

    ఏకాదశి వ్రత నియమాలు:

    ఏకాదశి వ్రత నియమాలు:

    • వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వారు మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.
    • వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణ భక్తి శ్రద్ధలతో ఆచరించి, అన్ని పూజా క్రతువులను అనుసరించి విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు.
    • ఏకాదశి వ్రతం దశమి తిథికి ఒకరోజు ముందు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి రాగానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి బ్రహ్మచర్యం పాటించాలి.
    • ఏకాదశి వ్రతం సందర్భంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం వేళ పాలు, పండ్లు తీసుకోవచ్చు.
    • ఉపవాసం ఉన్నంత సేపు మహావిష్ణువు నామజపం చేయాలి. శ్లోకాలు, మంత్రాలు పఠించాలి.
    • దేవాలయాలు సందర్శించి విష్ణు సేవలో తరించాలి.
    • వీలైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనస్సు కలత చెందకుండా చూసుకోవాలి.
    • వైకుంఠ ఏకాదశి పూజా ఆచారాలు:

      వైకుంఠ ఏకాదశి పూజా ఆచారాలు:

      • ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానాలు చేయాలి
      • ఆలయాలకు వెళ్లి భగవంతుడిని ప్రార్థించాలి.
      • స్వామి వారికి పూలు, పండ్లు, స్వీట్లు అర్పించవచ్చు.
      • శ్రీహరి స్తోత్రం, విష్ణు సహస్రనామం, వ్రత కథ చదవాలి
      • ద్వాదశి తిథి నాడు ఉపవాసం విరమించాలి.
      • ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక భోజనం చేయాలి.
      • మంత్రాలు:

        మంత్రాలు:

        • శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారీ హే నాథ్ నారాయణ్ వాసుదేవ
        • అచ్యుతం కేశ్వం కృష్ణ దామోదరం రామ్ నారాయణం జంకీ వల్లభం

Story first published: Saturday, December 31, 2022, 19:55 [IST]
Desktop Bottom Promotion