2025లో ప్రపంచం అంతం ప్రారంభం.. వంగబాబా భవిష్యవాణి నిజమౌతుందా..?

వంగబాబా 2025వ సంవత్సరం గురించి చెప్పినవన్నీ నిజం కాబోతున్నాయనే అని చాలా మందిలో ఆందోళన మొదలైంది. ప్రపంచం 2025లో అంతం కాబాతోందని వంగబాబా మనకు చెబుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చేసినా దీని గురించే చర్చ నడుస్తోంది. వంగబాబాకు కళ్లు చిన్న వయసులో ఒక తుఫాన్‌లో పోయాయ్. కళ్లు పోయినప్పటి నుంచి తనకు చెందిన ఇతర ఇంద్రియాలు బాగా పనిచేయడం మొదలుపెట్టాయ్. తనకు తెలియకుండానే ఏవేవో సందేశాలు తనకు వస్తున్నట్టు వంగబాబా తెలిపింది. తనకు వచ్చిన సందేశాలను వచ్చింది వచ్చినట్టుగా తన పక్కవారికి చెప్పడంతో అవన్నీ నిజం అవుతూ వస్తున్నాయ్. తాజాగా వంగబాబా 2025లో ప్రపంచం అంతం కాబోతున్నట్టు భవిష్యవాణి వినిపించింది.

vanga baba 2025 prediction

బాల్కన్‌కు చెందిన ఈమెను బాల్కన్ నోస్ట్రడామస్‌గా గుర్తింపు వుంది. అమెరికాలో ట్విన్ టవర్లు కూలిపోతాయని వంగబాబా 1989లోనే చెప్పడం అప్పట్లో ఆ సంఘటన జరిగిన తరువాత అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2023లోనే ప్రపంచంలో న్యూక్లియర్ బాంబులతో నాశనం కాబోతోందని ముందే చెప్పింది. 1996లోనే వంగబాబా చనిపోయినప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు కూడా జరుగుతూ వస్తోంది. 2023లో న్యూక్లియర్ బాంబులు పేలతాయని చెప్పినప్పుడు అదే సంవత్సరం పెసఫిక్ సముద్రంపై హైడ్రోజెన్ బాంబులు పేలుస్తామని నార్త్ కొరియా హెచ్చరించింది.

5079లో ఈ భూమిపైన వున్న మనుషులు మొత్తం తుడిచిపెట్టుకుపోతారని వంగబాబా భవిష్యవాణి చెబుతోంది. అయితే ప్రపంచం అంతం కావడం 2025లో ప్రారంభమవుతుందని కూడా ఆమె చెప్పింది. 2025లో యూరప్‌లో ఒక అస్థిరత వచ్చి ఆ యూరప్ ఖండం మొత్తం అతలాకుతలమవుతుందని వంగాబాబా చెప్పింది.

2028 వ సంవత్సరంలో మనుషులు వీనస్ గ్రహాన్ని చేరుకొని వాటిపై పరిశోధనలు జరుపుతారు. ఇటీవల ఎలాన్ మస్క్ వీనస్ గ్రహంపైన కూడా పరిశోధనలు జరుపుతామని ప్రకటనలు చేసిన విషయం గమనార్హం.

vanga baba 2025 prediction

2023లో మంచుతో కప్పబడివున్నవి కరిగిపోయి సముద్ర మట్టం అమాంతంగా పెరిగిపోతుందని చెప్పింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందని వంగబాబా హెచ్చరించింది. 2076వ సంవత్సరం వరకు కమ్యునిజం ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తుందని వంగబాబా చెప్పింది. 2130వ సంవత్సరానికి గాను భూమిపైన వున్న మనుషులు ఇతర గ్రహాలపైన వున్న ఏలియన్స్‌లో కాంటాక్ట్‌ అవుతారని వంగబాబా భవిష్యవాణి చెబుతోంది.

2170వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన కరువు కాటకాలు వచ్చి ప్రజలు నీరు లేక వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని వంగబాబా తెలియజేసింది. 3005వ సంవత్సరంలో భూమి మార్స్ గ్రహంపైన వున్న వాళ్తతో యుద్ధానికి వెళ్తుందని వంగబాబా స్పష్టం చేసంది. 3797వ సంవత్సరానికి గాను మనుషులు భూమిని వదిలి వేరేే గ్రహానికి వెళ్లే పరిస్థితి వస్తుందని, ఇక భూమిపై మనుషులు జీవించలేని కారణంగా ఇలా జరుగుతుందని వంగబాబా ముందే చెప్పేసింది. ఇక 5079వ సంవత్సరం ప్రపంచం, భూమి మొత్తం అంతం అవుతుందని ఆమె భూమి, మనుషులందికి సంబంధించిన భవిష్యవాణి వినిపించింది.

వంగబాబా బాల్కన్ దేశంలో 1911 జనవరి 11లో పుట్టింది. ఆమె అసలు పేరు వాంగేలియా పాండెవా గుష్‌టెరోవా. ఈమెకు బాల్కన్ నోస్ట్రడామస్ అని పాపులర్ పేరు కూడా వుంది. 12 ఏళ్ల వయసులో ఒక వరదలో ఆమె తన రెండు కళ్లను పోగొట్టుకుంది. అపటి నుంచి ఆమెకు ఏవో అతీత శక్తులు సందేశాలను పంపిస్తున్నట్టు చెప్పింది. ఆమెకు వచ్చిన సందేశాలను వెంటనే తన చుట్టూ వున్న వాళ్లతో పంచుకుంది. అలా పంచుకున్న విషయాలు తరువాత నిజమయ్యాయ్. ఇంగ్లాండ్ మహారాణి ప్రిన్సెస్ డయానా కొన్ని కారణాల వల్ల చనిపోతుందని వంగబాబా ముందుగానే చెప్పింది. అలాగే అమెరికాలో జరిగిన 9/11 దాడుల గురించి కూడా ముందుగానే చెప్పింది. ఇలా ఆమె చెప్పిన విషయాలు చెప్పినట్టుగా జరిగాయ్. 1996 ఆగస్టు 11న ఆమె మరణించారు.

Story first published: Thursday, July 11, 2024, 17:16 [IST]
Desktop Bottom Promotion