Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
రూ.20కే మంగళసూత్రం..ఆ ప్రేమకు చలించిపోయిన గోల్డ్ షాప్ ఓనర్..వైరల్ వీడియో
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గేదే లే అన్నట్లుగా గోల్డ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఒక ఉంగరం కొనాలన్నా సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో పెరిగిన బంగారం ధరల గురించి తెలియక గోల్డ్ షాప్ కి వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యకు మంగళసూత్రం కొనాలని వెళ్లిన తాతకు ఊహించని విధంగా ఎదురైన అనుభవం ఏంటో ఇక్కడ చూడండి.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని అంబోరా గ్రామానికి చెందిన నివృత్తి షిండే(93),శాంతాభాయ్ భార్యాభర్తలు. అయితే ఎక్కడికి వెళ్లినా భార్యాభర్తలు కలిసే వెళ్తారు. వీరికి ధైవ భక్తి ఎక్కువగా ఉంది. వచ్చే నెలలో ఆషాఢ ఏకాదశి పండుగ ఉండటంతో కాలినడకన ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన సోలాపూర్ జిల్లాల్లోని పండార్ పూర్ కి కాలినడకన వెళ్లడం మొదలుపెట్టారు. అయితే ఛత్రపతి సంభాజీనగర్ కి(గతంలో ఔరంగాబాద్)చేరుకోగానే ఈ దంపతులు వెళ్తున్న దారిలో ఓ గోల్డ్ షాపులోకి వెళ్లారు. అయితే వీరు ఏదైనా ఛారిటీ కోసం వచ్చారో లేదా సహాయం కోసం వచ్చారేమో అని షాపులో వాళ్లు అనుకున్నారు. అయితే తాను ఎందుకు వచ్చాను అనేది తాత చెప్పగానే అక్కడ పనిచేసేటోళ్లు చాలా ఎమోషనల్ అయ్యారు.

ధోతీ,కుర్తా,నెత్తిమీద క్యాప్ ధరించి ఉన్న తాత అమాయకపు చూపులు షాపులో పనిచేసేటోళ్ల హృదయాలను పిండేశాయి. తన భార్య శాంతాభాయ్ కోసం ఓ మంగళసూత్రం కొనడానికి షాపుకి వచ్చాను అని తాత షాపులో వాళ్లతో చెప్పాడు. షాపు ఓనర్ కూడా అక్కడే ఉండటంతో ఆయన ఇదంతా గమనిస్తున్నాడు. ఈ సమయంలో తాత తన జేబులో నుంచి రూ.1120 తీసి మంగళసూత్రం కావాలని అడిగాడు. అయితే ఇది గమనించిన షాపు ఓనర్ చలించిపోయాడు. ఆ పెద్దాయన దగ్గర నుంచి కేవలం రూ.20 తీసుకొని మంగళసూత్రాన్ని ఇచ్చాడు. ఇదంతా షాపులో ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోకి 2 కోట్లకు పైగా వ్యూస్,లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఈ వయస్సులో కూడా తన భార్య కోసం మంగళసూత్రం కొనాలనుకున్న తాత గ్రేట్..ఆ షాపు ఓనర్ కి వాళ్ల ఆశీర్వాదం ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..నో డైమండ్స్, నో ఫ్యాన్సీ గిఫ్ట్స్..ఓన్లీ లైఫ్ టైమ్ కమిట్ మెంట్ అంటూ ఆ వృద్ధ దంపతులను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. జ్యూవెలరీ షాపు ఓనర్ చాలా దయగలిగిన వ్యక్తి అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.



Click it and Unblock the Notifications











