Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
Viral Videos : ఢిల్లీ మెట్రో రైలుపై మంటలు..! పబ్లిక్లో డ్రైవర్ను తుపాకీతో బెదిరించిన వ్యాపారవేత్త..!
ఢిల్లీ మెట్రోలో సురక్షితంగా వెళ్తున్నామనుకుంటున్న ప్రయాణికులకు ఇప్పుడు ఓ భయం మొదలైంది. ఢిల్లీ మెట్రో రైల్లో మంటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన చొటుచేసుకుంది. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
న్యూ ఢిల్లీలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైల్ ఆగివుంది. అక్కడి నుంచి వైశాలి వెళ్లడానికి సిద్ధంగా వుంది. కానీ అప్పుడే ఓ భయానక దృష్యం మెట్రోరైల్ ప్రయాణికుల్లో వణుకు పుట్టించింది. మెట్రో రైల్ పై భాగంలో రూఫ్టాప్లో మంటలు రావడం గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడున్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్స్లో బంధించారు. అక్కడేమి జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సరిగ్గా సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ వెంటనే స్పందించింది. చెలరేగిన మంటలు ప్యాంటోగ్రాఫ్ పైన తగలడం వల్ల వచ్చిందని రైలు అధికారులు వివరించారు. అసలు మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమేంటో త్వరలో తెలుసుకుంటామని అన్నారు. దుర్ఘటన జరిగిన తరువాత రైలుకు సంబంధించిన ప్యాంటోగ్రాఫ్ను తొలగించి వేరే ప్యాంటోగ్రాఫ్ను అమర్చారు. తరువాత ఐదు నిమిషాలు ట్రయల్ చెక్ చేసుకొని రైలును స్టార్ట్ చేశారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ మెట్రో స్లేషన్లో హైఅలెర్ట్ ప్రకటించాల్సిన అవసరం వుందన్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ మొత్తం ఒక ఫుడ్ కోర్టులా మారిందని ఒక యూజర్ విమర్శించారు. ఢిల్లీ మెట్రో రైళ్లో ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయ్.
ఇప్పుడే కాదు ఢిల్లీ మెట్రోలో గతంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయ్. ఢిల్లీ మెట్రోలో మొత్తం 266 స్టేషన్లు వుండడం విశేషం. ఢిల్లీ మెట్రోలో రోజుకు 46 లక్షలకు పైమంది మెట్రో రైలును ఎక్కుతారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ 2002లో ప్రారంభం కావడం విశేషం. ఢిల్లీ మెట్రో రైల్ కింద మొత్తం 336 ట్రైన్లు వున్నాయి.
ఉత్తరప్రదేశలో ఓ ప్రముఖ వ్యాపారి వినోద్ మిష్రా అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తుపాకీతో డ్రైవర్ను బెరించిన దృష్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన కారును డ్రైవర్ గుద్దడంతొ కోపం తట్టుకోలేక తుపాకీతో బ్రైవర్ను బెదిరించాడు. నడిరోడ్డుపై కాలర్ పట్టుకొని పిస్టాల్తోనే కొడుతుండడం చూడవచ్చు. ఈ దృష్యానికి సంబంధించిన వీడియోను ఒక జర్నలిస్ట్ పోస్ చేసి ముఖ్యమంత్రి, అధికారులు అందరూ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియోకు 2,30,000 ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా ఇలాంటి ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా జరిగినట్లు భావించవద్దా. వీడియో బాగా వైరల్ అవగానే విభూతికండ్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీసుుల స్పందించారు. తుపాకీ తీసిన అతనిపై కేసు నమోదు చేశారు. అతని పై సెక్షన్ 323, సెక్షన్ 151 నమోదు చేశారు. ఈ దుర్ఘటనను రాజకీయాలను ఉపయోగించుకుందామనికొని యూపీ కాంగ్రెస్ ఈ వీడియోను రీషేర్ చేసింది.



Click it and Unblock the Notifications











