Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
న్యూ ఇయర్ రోజున ఈ గుళ్లకు వెళ్తే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుంది.. 100 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది!
డిసెంబర్ 31వ తేదీన ఎంత ఎంజాయ్ చేసినా, రాత్రంతా తాగి పడుకున్నా.. జనవరి 1వ తేదీన ఉదయాన్నే లేచి గుడికి వెళ్లే అలవాటు చాలా మందికి ఉంటుంది. గుడికి వెళ్లి ఈ సంవత్సరం మొత్తం తమకు మంచి జరగాలని, తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. ఆ కోరికకలు నెరవేరుతాయి నెరవేరవో తెలియదు కానీ, తమ కోరికలు మాత్రం దేవుళ్ళకు చెప్పి, కొంత సేద తీరుతారు.
అయితే కొన్ని గుడులకు వెళ్తే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. సుమారు 100 సంవత్సర నుంచి ఆ గుడులకు వెళ్లి మొక్కుకుంటే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. ఇంతకీ ఆ గుడులు ఎక్కడ ఉన్నాయి? ఎలా వాటిని దర్శించుకోవాలి అనేది తెలుసుకుందాం.

ఆ గుడులు ఎక్కడ ఉన్నాయంటే?
న్యూ ఇయర్ రోజున చాలామంది ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకుంటారు. అయితే, నూతన సంవత్సరం రోజున ప్రత్యేక పూజలు అందుకొనే ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ ఆలయాలన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ నగరం చుట్టుపక్కల ఉన్నాయి.
- హల్ద్వానీ నగరంలోని శ్రీ కలుసిద్ద బాబాను దర్శించుకోవడానికి నూత సంవత్సరం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వెళ్తుంటారు. బాబాజీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, నిష్కల్మషంతో కోరికలు కోరితే.. అవి కచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇలా కొన్ని పదుల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయని అక్కడి భక్తులు చెబుతున్నారు.
- అలాగే హల్ద్వానీ నగరంలో ఉన్న సాయిబాబా ఆలయంలో పూజలు చేసి, కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తే.. కోరికలు నిజమవుతాయని స్థానికులు చెబుతారు. పూజలు చేసే సమయంలో కల్మషం లేకుండా పూజించాలని అలా చేస్తే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయని విశ్వశిస్తారు.
- అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో గల కద్దోడంలో ఓ ఎత్తైన శిఖరంపై ఉన్న షీట్లా దేవి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఈ ఆలయంలో కొత్త సంవత్సరం కోరిక కోరితే.. అమ్మవారు తప్పక తీర్చుతారని భక్తులు విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications











