Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
న్యూ ఇయర్ రోజున ఈ గుళ్లకు వెళ్తే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుంది.. 100 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది!
డిసెంబర్ 31వ తేదీన ఎంత ఎంజాయ్ చేసినా, రాత్రంతా తాగి పడుకున్నా.. జనవరి 1వ తేదీన ఉదయాన్నే లేచి గుడికి వెళ్లే అలవాటు చాలా మందికి ఉంటుంది. గుడికి వెళ్లి ఈ సంవత్సరం మొత్తం తమకు మంచి జరగాలని, తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. ఆ కోరికకలు నెరవేరుతాయి నెరవేరవో తెలియదు కానీ, తమ కోరికలు మాత్రం దేవుళ్ళకు చెప్పి, కొంత సేద తీరుతారు.
అయితే కొన్ని గుడులకు వెళ్తే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. సుమారు 100 సంవత్సర నుంచి ఆ గుడులకు వెళ్లి మొక్కుకుంటే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. ఇంతకీ ఆ గుడులు ఎక్కడ ఉన్నాయి? ఎలా వాటిని దర్శించుకోవాలి అనేది తెలుసుకుందాం.

ఆ గుడులు ఎక్కడ ఉన్నాయంటే?
న్యూ ఇయర్ రోజున చాలామంది ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకుంటారు. అయితే, నూతన సంవత్సరం రోజున ప్రత్యేక పూజలు అందుకొనే ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ ఆలయాలన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ నగరం చుట్టుపక్కల ఉన్నాయి.
- హల్ద్వానీ నగరంలోని శ్రీ కలుసిద్ద బాబాను దర్శించుకోవడానికి నూత సంవత్సరం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వెళ్తుంటారు. బాబాజీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, నిష్కల్మషంతో కోరికలు కోరితే.. అవి కచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇలా కొన్ని పదుల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయని అక్కడి భక్తులు చెబుతున్నారు.
- అలాగే హల్ద్వానీ నగరంలో ఉన్న సాయిబాబా ఆలయంలో పూజలు చేసి, కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తే.. కోరికలు నిజమవుతాయని స్థానికులు చెబుతారు. పూజలు చేసే సమయంలో కల్మషం లేకుండా పూజించాలని అలా చేస్తే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయని విశ్వశిస్తారు.
- అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో గల కద్దోడంలో ఓ ఎత్తైన శిఖరంపై ఉన్న షీట్లా దేవి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఈ ఆలయంలో కొత్త సంవత్సరం కోరిక కోరితే.. అమ్మవారు తప్పక తీర్చుతారని భక్తులు విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications