Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..సాయంత్రం భారీ వర్షం పడే ఛాన్స్..ట్రాఫిక్ లో ఇరుక్కోకముందే ఇళ్లకు వెళ్లడం బెటర్!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు వర్షం ఉపశమనం కలిగించనుంది. ఇవాళ(ఏప్రిల్ 8)సాయంత్రం నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిసపింది. బలమైన ఈదురుగాలుు,మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షం పడిందంటే నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. కాబట్టి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు తొందరగా ఇంటికి వెళ్లిపోవడం ఉత్తమం. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఇవాళ,రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్షోగ్రతలు తగ్గుముఖం పట్టి వాతావరణం చల్లడబడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. కాగా,సోమవారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్మల్ లో నమోదైంది.
ఇక, హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ని ఆదేశించారు.



Click it and Unblock the Notifications











