Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..సాయంత్రం భారీ వర్షం పడే ఛాన్స్..ట్రాఫిక్ లో ఇరుక్కోకముందే ఇళ్లకు వెళ్లడం బెటర్!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు వర్షం ఉపశమనం కలిగించనుంది. ఇవాళ(ఏప్రిల్ 8)సాయంత్రం నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిసపింది. బలమైన ఈదురుగాలుు,మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షం పడిందంటే నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. కాబట్టి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు తొందరగా ఇంటికి వెళ్లిపోవడం ఉత్తమం. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఇవాళ,రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్షోగ్రతలు తగ్గుముఖం పట్టి వాతావరణం చల్లడబడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. కాగా,సోమవారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్మల్ లో నమోదైంది.
ఇక, హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ని ఆదేశించారు.



Click it and Unblock the Notifications