Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
భారత్ లో తొలి విమానం ఏ నగరంలో,ఎంత వేగంతో ప్రయాణించిందో తెలుసా!
ప్రస్తుతం మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అనేక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. వేలాది విమానాలు ప్రతిరోజూ మన గగనతలంలో దూసుకుపోతూ భారత విమానయాన పరిశ్రమ శక్తిని చాటుతున్నాయి. గంటల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా విమానంలో యాణించగలుగుతున్నాం. అయితే వందేళ్లకు పైగా క్రితం విమానాన్ని ఒక అద్భుతంగా భావించే రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటి విమానం ఎగిరినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉండి ఉంటుందో ఊహించగలరా? ఆ చారిత్రాత్మక ఘట్టం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
ఆ చారిత్రాత్మక రోజు
ఆ రోజు ఫిబ్రవరి 18, 1911. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ నగరం ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారతదేశంలో మొట్టమొదటి విమానం హంబర్ బైప్లేన్ గాలిలోకి లేచింది. ఈ విమానం అలహాబాద్ నుండి నైని వరకు కేవలం 6 మైళ్ల (9.6 కి.మీ) దూరాన్ని 13 నిమిషాల్లో పూర్తి చేసింది. దాని వేగం ఎంత నెమ్మదిగా ఉండేదంటే వేగంగా పరుగెత్తే వ్యక్తి కూడా దానిని ఓడించగలడని ప్రజలు సరదాగా అనుకునేవారు. గంటకు 40-45 మైళ్ల వేగంతో ఇది అప్పటి బస్సుల కన్నా నెమ్మదిగా ప్రయాణించేది.

ప్రపంచ రికార్డు
తక్కువ వేగంతో ప్రయాణించినా, ఈ విమానం ఒక గొప్ప లక్ష్యంతో ఎగిరింది. అది ప్రయాణికులను చేరవేయడానికి కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవను ప్రారంభించడానికి ఎగిరింది. ఫ్రెంచ్ పైలట్ హెన్రీ బెకెట్ నడిపిన ఈ విమానం 6,500 ఉత్తరాలతో నిండిన సంచిని మోసుకెళ్లింది. అలహాబాద్ పోలో గ్రౌండ్ నుండి గాలిలోకి లేచిన ఈ విమానం నైని జంక్షన్లో సురక్షితంగా దిగి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది భారత విమానయాన చరిత్రకే కాకుండా ప్రపంచ తపాలా సేవలకు కూడా ఒక మైలురాయిగా నిలిచింది.
విమానం వెనుక కథ
1911లో అలహాబాద్లో జరుగుతున్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, పవిత్ర కుంభమేళా కోసం బ్రిటిష్, కలోనియల్ ఎయిర్ కంపెనీ ఈ విమానాన్ని ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి పంపింది. ఈ విమానాన్ని సముద్ర మార్గంలో, 100కు పైగా పెట్టెలలో దాని భాగాలను పంపారు. బ్రిటిష్ ఇంజనీర్లు అలహాబాద్లో రోజుల తరబడి శ్రమించి ఆ భాగాలను తిరిగి ఒక విమానంగా మార్చారు. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఇక విమానం ఎగిరే రోజున దాదాపు లక్ష మంది ప్రజలు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించడానికి గుమిగూడారు.
50 హార్స్ పవర్ ఇంజిన్ తో నడిచే ఈ చిన్న విమానం భారత విమానయాన రంగంలో ఒక మహా ప్రస్థానానికి నాంది పలికింది. ఆ హంబర్ బైప్లేన్ చిన్న విమానమే కావచ్చు, దాని ప్రయాణం చిన్నదే కావచ్చు, కానీ అది భారత విమానయాన చరిత్రలో వేసిన తొలి అడుగు.



Click it and Unblock the Notifications