Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
భారత్ లో తొలి విమానం ఏ నగరంలో,ఎంత వేగంతో ప్రయాణించిందో తెలుసా!
ప్రస్తుతం మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అనేక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. వేలాది విమానాలు ప్రతిరోజూ మన గగనతలంలో దూసుకుపోతూ భారత విమానయాన పరిశ్రమ శక్తిని చాటుతున్నాయి. గంటల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా విమానంలో యాణించగలుగుతున్నాం. అయితే వందేళ్లకు పైగా క్రితం విమానాన్ని ఒక అద్భుతంగా భావించే రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటి విమానం ఎగిరినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉండి ఉంటుందో ఊహించగలరా? ఆ చారిత్రాత్మక ఘట్టం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
ఆ చారిత్రాత్మక రోజు
ఆ రోజు ఫిబ్రవరి 18, 1911. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ నగరం ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారతదేశంలో మొట్టమొదటి విమానం హంబర్ బైప్లేన్ గాలిలోకి లేచింది. ఈ విమానం అలహాబాద్ నుండి నైని వరకు కేవలం 6 మైళ్ల (9.6 కి.మీ) దూరాన్ని 13 నిమిషాల్లో పూర్తి చేసింది. దాని వేగం ఎంత నెమ్మదిగా ఉండేదంటే వేగంగా పరుగెత్తే వ్యక్తి కూడా దానిని ఓడించగలడని ప్రజలు సరదాగా అనుకునేవారు. గంటకు 40-45 మైళ్ల వేగంతో ఇది అప్పటి బస్సుల కన్నా నెమ్మదిగా ప్రయాణించేది.

ప్రపంచ రికార్డు
తక్కువ వేగంతో ప్రయాణించినా, ఈ విమానం ఒక గొప్ప లక్ష్యంతో ఎగిరింది. అది ప్రయాణికులను చేరవేయడానికి కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవను ప్రారంభించడానికి ఎగిరింది. ఫ్రెంచ్ పైలట్ హెన్రీ బెకెట్ నడిపిన ఈ విమానం 6,500 ఉత్తరాలతో నిండిన సంచిని మోసుకెళ్లింది. అలహాబాద్ పోలో గ్రౌండ్ నుండి గాలిలోకి లేచిన ఈ విమానం నైని జంక్షన్లో సురక్షితంగా దిగి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది భారత విమానయాన చరిత్రకే కాకుండా ప్రపంచ తపాలా సేవలకు కూడా ఒక మైలురాయిగా నిలిచింది.
విమానం వెనుక కథ
1911లో అలహాబాద్లో జరుగుతున్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, పవిత్ర కుంభమేళా కోసం బ్రిటిష్, కలోనియల్ ఎయిర్ కంపెనీ ఈ విమానాన్ని ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి పంపింది. ఈ విమానాన్ని సముద్ర మార్గంలో, 100కు పైగా పెట్టెలలో దాని భాగాలను పంపారు. బ్రిటిష్ ఇంజనీర్లు అలహాబాద్లో రోజుల తరబడి శ్రమించి ఆ భాగాలను తిరిగి ఒక విమానంగా మార్చారు. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఇక విమానం ఎగిరే రోజున దాదాపు లక్ష మంది ప్రజలు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించడానికి గుమిగూడారు.
50 హార్స్ పవర్ ఇంజిన్ తో నడిచే ఈ చిన్న విమానం భారత విమానయాన రంగంలో ఒక మహా ప్రస్థానానికి నాంది పలికింది. ఆ హంబర్ బైప్లేన్ చిన్న విమానమే కావచ్చు, దాని ప్రయాణం చిన్నదే కావచ్చు, కానీ అది భారత విమానయాన చరిత్రలో వేసిన తొలి అడుగు.



Click it and Unblock the Notifications