Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Sita Navami 2024 : సీతానవమి తేది, పూజా విధానం.. జానకీ నవమి ప్రాముఖ్యత
హిందువుల్లో శ్రీరామనవమి చాలా పెద్ద పండగ. శ్రీరాముడి జన్మదినంగా, శ్రీసీతారాముడి కళ్యాణ దినంగా, రాముడి పట్టాభిషేకం జరిగిన దినంగా శ్రీరామనవమికి ప్రాధాన్యత ఉన్నది. శ్రీరాముడి జన్మదినం ఉన్నట్టే సీతాదేవి జన్మదినం కూడా ఉంది. దాన్నే మనం సీతానవమిగా జరుపుకుంటాం. వైశాఖ మాసం శుక్ల పక్షంలో సీతా నవమిని జరుపుకుంటాం. అదే రోజు సీతమ్మ జన్మదినంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కూడా అదే రోజు సీత జన్మించిందని అంటారు.
సీతా నవమిని జానకీ నవమి అని కూడా అంటారు. సీతా నవమిని ఎలా జరుపుకుంటారు. సీతమ్మను పూజించడం వల్ల ఎలాంటి లాభాన్ని పొందుతారు. సీతా నవమి ఏ తేదీన వస్తుంది. సీతా నవమికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మ కథ చెప్పినట్టుగానే జానకీ నవమి రోజు కూడా సీతమ్మ జన్మదిన కథ గురించి వివరిస్తారు. ఈ సంవత్సరం సీతానవమిని మే 16న జరుపుకోనున్నాము. జానకీ నవమి 16 మే ఉదయం 6 గంటల 22 నిమిశాల నుంచి 17 మే 8 గంటల 48 నిమిశాల వరకు సాగుతుంది
సీతా నవమి ప్రాముఖ్యత
సీతా నవమికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రముఖ్యత ఉన్నది. శ్రీరామనవమికి ఎంత ప్రముఖ్యత ఉన్నదో సీతానవమికి కూడా అదే ప్రాముఖ్యత ఉన్నాది. ఈ రోజు జానకీరాముడు గుళ్లో, వీధుల్లో ప్రత్యేక పూజలను అందుకుంటారు. ఇలా పూజచేసిన వారికి భూమిని దానం చేసినంత ప్రతిఫలం లభిస్తుంది. వివాహ జీవితం సంతోషంగా కొనసాగడానికి, శాంతంగా కొనసాగడానికి కూడా సీతానవమి పూజా మంచి అవకాశంగా భావించవచ్చు. కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని ఆ జానకీ మాతను పూజిస్తే తప్పక ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
రామాయణంలో రాముడి జన్మ గురించి ఉన్నట్లే సీతాదేవి జన్మ గురించి కూడా వుంది. సీతమ్మ మిథిలాలో జన్మించింది. పుట్టక ముందు అక్కడ తీవ్రమైన కరువు రావడం వల్ల ప్రజలు పిల్లలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలిసిన ఓ యోగి, కరువు నుంచి ఎలాగైనా మిథిలాను రక్షించాలని యాగం చేస్తాడు. యాగం తరువాత మిథిలా రాజుకు నాగలితో పొలం దున్నమని చెబుతాడు. యోగి చెప్పనట్లుగా నాగలి తీసి దున్నడం ప్రారంభించగానే రాజుకు చెందిన నాగలి భూమిలో ఇరుక్కుపోతుంది. నాగలిని భూమిలోంచి తీయగానే అక్కడ బంగారు మూటలో ఓ అందమైన పసిపాపను చస్తారు. ఆ పాపను రాజు తన చేతిలోకి ఎత్తుకోగానే అక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటివరకున్న కరువు మొత్తం పోయినట్టు అయింది.
మిథిలారాజు ఆ పాపకు సీత అని నామకరణం చేశాడు. ఇక ఆ పాపను తన కూతురిగా భావించి జాగ్రత్తగా పెంచాడు. ఇదే కథను జానకీనవమి రోజున అంతటా వినిపిస్తారు. కానీ శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినంత ఎక్కువగా సీతానవమి ఉత్సవాలు జరగవు. దీనికి గల కారణాలు పండితులకు తెలియాలి. రామాయణంలో సీతా దవి అనేక కష్టాలు పడింది. కష్టాలు పడిన స్త్రీకి ప్రతీకగా సీతమ్మను చూపిస్తారు. అలాగే అనంతమైన ఓర్పు కలిగిన మాతగా కూడా సీతమ్మను ఉదహరిస్తారు. సీతాదేవికి ఇద్దరు పుత్రులు. వారే లవుడు, కుషుడు.



Click it and Unblock the Notifications











