Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
మానసిక వేదనలో తల్లులు! భధ్రతలేని పిల్లలు!
ఉద్యోగాలు, ఇంటిపని, డిప్రెషన్ లేదా పేదరికం ఇతర సమస్యలు మొదలైన ఒత్తిడి దీర్ఘకాలంనుండి వుంటే, మహిళలు తమ పిల్లల విషయంలో నిర్లక్ష్యంగాను, శత్రుత్వంతోను, పట్టించుకోకుండాను వుంటారని పరిశోధకులు చెపుతున్నారు.

డిప్రెషన్ లక్షణాలున్న తల్లులు లేదా పేదరికానికి గురైన తల్లులు ఒత్తిడికి అధికంగా స్పందించడం తమ పిల్లల అవసరాలకు నిర్లక్ష్యం వహించడం చేస్తూ సమస్యలు తెచ్చుకుంటున్నారని స్టడీ చెపుతోంది.
ఒత్తిడి చర్మం కిందిపొరలలో చేరుతుందని రోచెస్టర్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్ మెలిస్సా స్టర్జ్ ఆపిల్ వివరించారు. ఒత్తిడి అనేది మన తలలలో లేదని అది శరీరంలో మాత్రమే వుందన్నారు.
చిన్న పిల్లల సాధారణ డిమాండ్లకు అది వెంటనే స్పందిస్తుందని అవి తల్లులకు ఎంతో కష్టాన్ని కలిగించేవిగా వుంటాయన్నారు. ఒత్తిడి కి తల్లులు స్పందించే తీరు వారి గుండె చప్పుడును సైతం మార్చివేస్తోందట. స్టడీలో పరిశోధకులు 153 మంది తల్లులను వారి 17 నుండి 19 నెలల వయసున్న పిల్లలను పరిశోధించారు. మనోవేదన గల తల్లులు వారి పిల్లల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించి నట్లుగా కూడా చెప్పారు. పేదరికంలో వుండి నేర ప్రవృత్తిగల ప్రాంతాలలో వున్న తల్లులు తమ పిల్లలపట్ల వుంటే ఉదాసీనంగాను లేదా అతి చురుకుగాను కూడా ఈ రకమైన భావాలను వెల్లడిస్తున్నట్లు స్టడీ తెలిపింది. ఈ స్టడీ డెవలప్ మెంట్ అండ్ సైకోపాధాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.
మరి పిల్లల పెంపకం ఎలా ఉండాలి? పిల్లల్ని సవ్యంగా పెంచాలంటే వారితో తల్లితండ్రులు గట్టి అనుబంధం ఏర్పరచుకోవాలి. ఈ అనుబంధం వారిమధ్య ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి శిశువు దశ నుండి టీన్ ఏజ్ వరకు తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య ఈ అనుబంధం అవసరం ఎంతో వుంటుంది. తండ్రికి, తల్లికి అతి దగ్గరగా వున్న పిల్లలు వారు చెప్పే ఆదేశాలను ఎప్పటికపుడు ఆచరిస్తారు. ఈ బంధం కొరవడితే అవిధేయత కొట్టవచ్చినట్లు కనపడుతుంది. అదే జరిగితే, ఇక పేరెంట్ ముఖంలో పిల్లల అలవాట్లు నియంత్రించలేని అసమర్ధత కొట్టోచ్చినట్లు కనపడుతుంది.
ఈ ఒక్క అనుబంధమనే సాధనం పిల్లలు టీనేజ్ దాటినప్పటికి సమర్ధవంతంగా వారి జ్ఞాపకాలలో మిగిలిపోతుంది. పిల్లల అలవాట్ల నియంత్రణలో అన్ని సాధనాలు నిరుపయోగమైనప్పటికి అనుబంధమనే సాధనం అద్భుతంగా పనిచేస్తూనే వుంటుంది. ఇది లేని తల్లితండ్రులు ఎంతో విలువైన బంధాన్ని తమ పిల్లలపట్ల కోల్పోయినట్లే.
ఈ అనుబంధం బిడ్డ మానసిక స్ధిరత్వానికి కూడా అత్యవసరమైంది. ఇటీవలే చేసిన ఒక స్టడీ మేరకు చిన్నతనంలో తల్లితండ్రుల అనుబంధం లోపించిన పిల్లలు తమ నలభై ఏళ్ళ వయసులో కూడా కొత్త వాతావరణంపట్ల, కొత్త వ్యక్తులతో సమాజంలో మెలగటం పట్ల తీవ్ర అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడతారనేది వెల్లడైంది. మరి ఈ తల్లితండ్రుల - బిడ్డల అనుబంధం ఎలా ఏర్పడుతుంది. అది బిడ్డల శిశువు దశలోనే వారి ఆలనా పాలనా చూస్తుండటంతో, శారీరక స్పర్శలతో మాత్రమే ఏర్పడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.



Click it and Unblock the Notifications