పిల్లల ఘన ఆహారం ఎప్పటినుండి?

By B N Sharma

Solid Foods for Babies!
సాధారణంగా శిశువులకు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలతోనే అన్ని ఆహార అవసరాలు తీరిపోతాయి. ఇక వీరు బాగా పెరుగుతూ, రోజుకు అయిదు లేదా ఆరు సార్లు మూత్రవిసర్జన, ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జన చేస్తుంటే వారికి తల్లిపాలు సరిపోతున్నాయని, అన్ని ఆహారాలు అందుతున్నాయని భావించాలి.

అయితే వీరికి అదనపు ఆహారం కూడా అవసరమవుతుంది. ఈ అదనపు ఆహారంగా వారికి ఏమివ్వాలి? అనేది చాలామంది తల్లులకు సందేహంగా వుంటుంది. పిల్లలకు ఆరు నెలల వయసు పూర్తికాకముందు తల్లి పాలు తప్ప వేరే అదనపు ఆహారాన్ని అందించరాదు. అయితే, ఆరు నెలల వయసుపై బడి అదనపు ఆహారం అందించకపోతే ఎదిగే పిల్లలకు సమస్యలు వస్తాయి.

సాధారణంగా మన ప్రాంతాలలో ఆరవనెల రాగానే అన్న ప్రాసన చేయాలనే నియమం వాడుకలో వుంది. ఇది మంచి పద్ధతే. బిడ్డకు ఆరవనెలనుండి ఘన ఆహారం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఈ ఆహారం తయారీ బియ్యాన్ని బాగా వేయించి, ఉడికించి మెత్తటి గుజ్జులా చేసి కొద్ది కొద్దిగా నోటికి రాయటంతో మొదలవ్వాలి. పిల్లల నోరు చాలా సున్నితం కనుక గుజ్జులా చేసిన అన్నంలో కొద్దిపాటి నెయ్యు లేదా వెన్న వంటివి చేరిస్తే అది త్వరగా వారి ఆహార వ్యవస్ధకు జీర్ణం అయ్యేలా చేస్తుంది. అయినప్పటికి బేబీ పూర్తిగా ఘన ఆహారానికి అలవాటు పడేటంత వరకు తల్లిపాలు కూడా తాగిస్తూనే వుండాలి.

Story first published: Monday, March 12, 2012, 14:43 [IST]
Desktop Bottom Promotion