Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
టీ.వి.లు, ఇంటర్నెట్ ల మత్తులో పిల్లలు!

ఇక పెద్దవారు, కంప్యూటర్లు, టి.వి.లముందు ప్రతిరోజు కనీసం అంటే 6. 1 గంటలు కూర్చుంటున్నారట. ఈ సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. నేడు పుట్టిన ఒక శిశువు ఏడు సంవత్సరాలు వచ్చేసరికి స్క్రీన్ ముందు కనీసం ఒక సంవత్సరం 24 గంటల రోజులు గడుపుతున్నాడట. నేడు ఆధునికంగా వస్తున్న పిల్లల తరం స్క్రీన్ కు బాగా అలవాటు పడి చెడిపోతున్నారని రీసెర్చర్ డా. అరిక్ సిగ్మన్ వెల్లడించారు. మన బ్రెయిన్ లోని రసాయనాలను ఈ టి.వి.లు, కంప్యూటర్లు చెడగొడుతున్నాయని రీసెర్చర్ తెలిపినట్లు స్కై న్యూస్ ఏజన్సీ పేర్కొంది.
కంప్యూటర్ ఆటలు, టి.వి.లు చూస్తూ కూర్చోవడం వంటివి ఇప్పటివరకు మనం చెడుగా భావిస్తున్న జూదం ఆటలకిందే వచ్చి పిల్లలు, పెద్దలు చెడిపోయేలా చేస్తున్నాయని, గతంలో జూదం బ్రెయిన్ లో రసాయనిక మార్పులు కలిగించినట్లు, నేడు ఇవి కూడా ప్రత్యేకించి డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి చేస్తున్నాయని, మీకిష్టమైన పని చేస్తుంటే మీరు దానిని మంచిగా భావించటం అనేది ఈ రసాయనం వలన కలుగుతుందని రీసెర్చర్లు తెలిపారు.
ఈ డోపమైన్ కనుక బ్రెయిన్ ఎదిగే దశలో పిల్లలలో ఇదే తీరులో వారానికి అనేక గంటలు చొప్పున ఉత్పత్తి అయితే, ఇక వీరు దినంలో చాలావరకు వారి భవిష్యత్తులో స్క్రీన్ ల వంక చూడలేని పరిస్ధితి వస్తుందని తెలిపారు. ఈసమస్యను అధిగమించటానికి గాను డా. సిగ్మన్ , కనీసం మూడు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు పిల్లలకు స్క్రీన్ చూపవద్దని, ఇక యుక్తవయసు పిల్లలకు తక్కువ సమయం కంప్యూటర్లకు, టీవిలకు కేటాయించాలని తెలిపారు.
స్క్రీన్ ఎంతసేపు చూడాలనే అంశంపై బ్రిటన్ ప్రభుత్వం తల్లితండ్రులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. కొన్ని దేశాలలో ఏడు సంవత్సరాలవయసు దాటిన వారికి రోజుకు రెండు గంటలు, వినోదంగా మాత్రమే స్క్రీన్ సమయం కేటాయించినట్లు రీసెర్చి వెల్లడించింది.



Click it and Unblock the Notifications