Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావంకు మహిళ ఏం చేయాలి?

1. సగటున, ఒక మహిళ 225 మి.లీ. రక్తాన్ని కోల్పోతుంది. బేబీ పుట్టిన తర్వాత రుతుక్రమం లో కూడా ఆమెకు రక్తస్రావం అధికంగానే వుంటుంది. బేబీకి గర్భంలో వున్నపుడు లైనింగ్ గా వున్న గర్భాశయ గోడ కూడా రక్తంతో బయటకు వచ్చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గించటానికిగాను తల్లులు తమ బిడ్డలకు తప్పక పాలు పట్టాలి. తల్లిపాలు పట్టే చర్య గర్భం కుచించుకుపోవటానికి సహకరిస్తుంది. అది రక్తస్రావం తగ్గించి గర్భం కుచించుకుపోవటాన్ని వేగిరం చేస్తోంది.
2. తల్లులు ఆచరించాల్సిన మరో విషయం విశ్రాంతి తీసుకోవడం. పాలు పట్టటమే కాక తగిన విశ్రాంతి ఆమెకుగల నొప్పులను, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావం జరిగేటపుడు మహిళ పడుకుని వుంటే స్రావం కొంత తగ్గే అవకాశం వుంది.
3. రక్తస్రావం అధికంగా వుంటే ప్యాడ్స్ తరచుగా ఎప్పటికపుడే మార్చవలసిన అవసరం వుంది. ఇలా చేస్తే, శరీరం వాసన కూడా రాకుండా వుంటుంది. మార్కెట్ లో దొరికే మంచి నాణ్యతగల శానిటరీ ప్యాడ్స్ వాడకం సూచించదగినది.
4. ప్రసవం తర్వాత పది రోజులకు రక్త స్రావం రంగుమారుతుంది. పింక్ లేదా బ్రౌన్ రంగుకు వస్తుంది. ఇది కనపడితే స్రావం తగ్గుతున్నట్లు చెప్పవచ్చు. అయితే, రంగుకనుక మారకుంటే, పొత్తికడుపు భాగంలో నొప్పి కొనసాగుతుంటే మహిళ సత్వరమే వైద్యుని సంప్రదించాల్సివుంటుంది.
5. తల్లులు కనుక ప్రసవం లేదా సిజేరియన్ తర్వాత రక్తస్రావం జరిగేటపుడు రక్తహీనత ఏర్పడితే వారికి ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు తగినంత ఎనర్జీని ఇచ్చి అలసటనుండి దూరం చేస్తాయి.
6. బిడ్డ పుట్టిన తర్వాత రక్తస్రావం అవుతున్న మహిళలు కనీసం 6 వారాల వరకు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టరాదు. స్నానం కూడా, ప్రత్యేకించి సిజేరియన్ ఆపరేషన్ అయినట్లయితే వైద్యుని సంప్రదింపుమేరకు చేయవలసి వుంటుంది.



Click it and Unblock the Notifications