ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావంకు మహిళ ఏం చేయాలి?

By B N Sharma

bleeding
బిడ్డ పుట్టిన తర్వాత మహిళకు ఎంతో అసౌకర్యంగా వుంటుంది. అత్యధిక రక్తాన్ని పోగొట్టుకుంటుంది. ఆమె ఎంతో బలహీనపడుతుంది. కనుక ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు పాటించాల్సి వుంటుంది. అందుకుగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి.

1. సగటున, ఒక మహిళ 225 మి.లీ. రక్తాన్ని కోల్పోతుంది. బేబీ పుట్టిన తర్వాత రుతుక్రమం లో కూడా ఆమెకు రక్తస్రావం అధికంగానే వుంటుంది. బేబీకి గర్భంలో వున్నపుడు లైనింగ్ గా వున్న గర్భాశయ గోడ కూడా రక్తంతో బయటకు వచ్చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గించటానికిగాను తల్లులు తమ బిడ్డలకు తప్పక పాలు పట్టాలి. తల్లిపాలు పట్టే చర్య గర్భం కుచించుకుపోవటానికి సహకరిస్తుంది. అది రక్తస్రావం తగ్గించి గర్భం కుచించుకుపోవటాన్ని వేగిరం చేస్తోంది.

2. తల్లులు ఆచరించాల్సిన మరో విషయం విశ్రాంతి తీసుకోవడం. పాలు పట్టటమే కాక తగిన విశ్రాంతి ఆమెకుగల నొప్పులను, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావం జరిగేటపుడు మహిళ పడుకుని వుంటే స్రావం కొంత తగ్గే అవకాశం వుంది.

3. రక్తస్రావం అధికంగా వుంటే ప్యాడ్స్ తరచుగా ఎప్పటికపుడే మార్చవలసిన అవసరం వుంది. ఇలా చేస్తే, శరీరం వాసన కూడా రాకుండా వుంటుంది. మార్కెట్ లో దొరికే మంచి నాణ్యతగల శానిటరీ ప్యాడ్స్ వాడకం సూచించదగినది.

4. ప్రసవం తర్వాత పది రోజులకు రక్త స్రావం రంగుమారుతుంది. పింక్ లేదా బ్రౌన్ రంగుకు వస్తుంది. ఇది కనపడితే స్రావం తగ్గుతున్నట్లు చెప్పవచ్చు. అయితే, రంగుకనుక మారకుంటే, పొత్తికడుపు భాగంలో నొప్పి కొనసాగుతుంటే మహిళ సత్వరమే వైద్యుని సంప్రదించాల్సివుంటుంది.

5. తల్లులు కనుక ప్రసవం లేదా సిజేరియన్ తర్వాత రక్తస్రావం జరిగేటపుడు రక్తహీనత ఏర్పడితే వారికి ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు తగినంత ఎనర్జీని ఇచ్చి అలసటనుండి దూరం చేస్తాయి.

6. బిడ్డ పుట్టిన తర్వాత రక్తస్రావం అవుతున్న మహిళలు కనీసం 6 వారాల వరకు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టరాదు. స్నానం కూడా, ప్రత్యేకించి సిజేరియన్ ఆపరేషన్ అయినట్లయితే వైద్యుని సంప్రదింపుమేరకు చేయవలసి వుంటుంది.

Story first published: Saturday, October 8, 2011, 9:39 [IST]
Desktop Bottom Promotion