Latest Updates
-
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే..
గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలా...?
గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలా...?

అయితే గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహార ప్రమాణాలు అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్యంపై పూర్తిగా ప్రభావం వేస్తున్నాయని తాజా అధ్యయనం బట్టి తెలుస్తోంది. స్త్రీ పురుష సంపర్కం తర్వాత ఫలదీకరణ ప్రక్రియ జరగక ముందునుంచే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనే అంశం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వేయనున్నదని డాక్టర్ ఆడమ్ వాట్కిన్స్ తెలిపారు.
మహిళ గర్భంలోని అండం అండాశయంలో పరిపక్వత చెందడం ప్రారంభించినప్పటినుంచీ గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం భావితరం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వేస్తుందని ఈ పరిశోధన తెలిపింది. ఫలదీకరణ, అండం రూపొందుకునే దశల్లో స్త్రీ పోషకాహారం తీసుకోలేదంటే అది పిల్లల తర్వాతి జీవితంపై వ్యతిరేక ప్రభావం కల్గిస్తోందని ఇటీవలి అధ్యయనాలు తెలిపాయి.
ఈ విషయాన్ని నిర్ధారించటానికి చేసిన ప్రయోగంలో ఆడ ఎలుకకు తక్కువ పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని ఇచ్చి తర్వాత దాన్ని మగ ఎలుకతో సంపర్కం చేయించారు. దీని తర్వాత ఫలితాలను పరిశీలిస్తే ఆ ఆడ ఎలుక సంతానం పలు సమస్యలకు గురవుతున్నట్లు గమనించారు.
కాబట్టి సంప్రదాయాల పేరుతూ గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్న కుటుంబాలు, సమాజం కాబోయే తల్లుల ఆహారం గురించి ఇకనైనా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది. భవిష్యత్తరాల బాగుకు ఇది చాలా అవసరం.



Click it and Unblock the Notifications