Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
గర్భిణీలు సీాఫ్ట్ డ్రింక్స్ తాగడం సురక్షితమేనా
మహిళ జీవితంలో ఒక ప్రెగ్నెన్సీ ఒక అందమైన , సంతోషకరమైన విషయం. మహిళ గర్భం పొందిన వెంటనే , ఆమెకు ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. ముఖ్యంగా ఆమె తీసుకొనే ఆహారం విషయంలో ఆమెంటే ఇష్టపడే వారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు , బందువులు ఇలా ఎరికి తోచిన జాగ్రత్తలను వారు అందిస్తుంటారు . ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను సూచిస్తుంటారు!
మహిళ గర్భం పొందిన తర్వాత ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి సూచిస్తుంటారు , దాంతో తల్లి ఆరోగ్యకరమైన బరువు పెరగడంతో పాటు, గర్భాధారణ కాలంను సురక్షితంగా ముగించడానికి సహాయపడుతుంది.

గర్భధారణ కాలంలో ఆహారం మీద కోరికలు ఎక్కువగా కలిగి ఉంటుంది. దాంతో ఎక్కువ ఆహారం లేదా అనారోగ్యకరమైన చిరుతిండ్లు మీద మనస్సు పడుతుంది . అది బిడ్డకు మాత్రమే కాదు, కడుపులో పెరిగే తల్లికి కూడా సురక్షితం కాదు..
గర్భధారణ సమయంలో ఎక్కువగా తినడం వల్ల ఓబేసిటికి కారణమవుతుంది. జీర్ణ సమస్యలు, హైబ్లడ్ ప్రెజర్ మొదలగు సమస్యలకు కారణం అవుతుంది. ఇటువంటి హెల్త్ కండీషన్స్ బిడ్డలోను మరియు కొన్ని సందర్భాల్లో తల్లిలోనూ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.

అందువల్ల, మహిళ గర్భం పొందిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటుందో గమనిస్తుండాలి. ఆమెహెల్తీ డైట్ ను మాత్రమే తీసుకోవాలి. తల్లికి మరియు బిడ్డకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను తీసుకోవడం వల్ల ఇద్దరు సురక్షితంగా ఉంటారు.
గర్భం పొందిన మహిళలు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఇంకా వారికి ఇష్టమైన ఆహారాలు మరియు పానీయాలను అందివ్వడానికి భయపడుతుంటరు. ఏం ఆహారం తింటే ఎలాంటి సమస్య వస్తుందని భయపడతారు. అలాంటి ఆహారాల్లో ఒకటి శీతల పానీయాలు ఒకటి మరియు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ , ఇవి పుట్టబోయే బిడ్డకు హనికలిగిస్తాయి? ఏవిధంగా అంటే ..

శీతల పానియాలు, సోడా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ పానీయాలు తాగడం వల్ల పుట్టబోయే బిడ్డలు ఊబకాయంతో పుడుతారు.
గర్భిణీలు సాప్ట్ డ్రింక్స్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఇతర సాధారణ పిల్లలతో పోల్చితే, బాడీమాస్ ఇండెక్స్ అధికంగా ఉండే పిల్లలకు జన్మనిస్తారు.
గర్భాధారణ సమయంలో రెగ్యులర్ గా శీతల పానియాలు తాగిన వారి పిల్లల్లో సంవత్సరంలో మెటబాలిక్ డిజార్డ్స్ మరియు బరువు తగ్గే సమస్యలు ఉంటాయి . ఇది ఖచ్చితంగా అనారోగ్యకరం మరియు పిల్లఆరోగ్యానికి ప్రమాదకరం . చిన్న వయస్సులో మెటబాలిక్ మరియు వెయిట్ సమస్యలు చాలా ప్రమాదకరం.

అందువల్ల గర్భిణీ మహిళలు శీతల పానియాలకు మరియు ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది . వీటిలో షుగర్ కంటెంట్ మరియు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. .



Click it and Unblock the Notifications











