Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రెగ్నెన్సీ మొదట్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. పిండం జారిపోయే ప్రమాదముంది..!
కడుపులో పిండం ఏర్పడిన తరువాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిండం బయటకు వచ్చేస్తుంది. అండం, శుక్రకణం కలిసి గర్భాశయం నుంచి వెళ్లి గర్భాశయంలో ఒక చోట వచ్చి అతుక్కుంటుంది. ఇలా అతుక్కొని తరువాత అదే స్థలంలో 9 నెలల వరకు పిండం క్రమంగా శిశువుగా ఎదుగుతుంది. పీరియడ్ అయిన 10 రోజుల తరువాత అండం తయారవడం ప్రారంభమౌతుంది. అదే సమయంలో అండం విడుదలౌతుంది. ఈ సమయంలో శుక్రకణం అండంతో గనుక కలిస్తే అప్పుడు ఆ సమయంలో అండం పిండంగా మారుతుంది. పిండం ఏర్పడిని రెండు వారాల తరువాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. బయట ఆహారాన్ని ఎక్కువగా తినవద్దు. మన శరీరంలో వున్న హార్మోన్లు సరైన విధంగా వుండాలి. ప్రొజిస్ట్రోన్ అనే హార్మోన్ కూడా బాగా పనిచేయాలి. బయట ఫుడ్ తీసుకోవడం వల్ల హార్మోన్లలో మార్పు వచ్చే అవకాశం వుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఐస్క్రీములు తినవద్దు. చెక్కరకు సంబంధించిన పదార్ధాలు కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మాంసాన్ని కూడా తీసుకోవద్దు.
బాదాంపప్పులను కచ్ఛితంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో ఫర్టిలిటీని మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ కూడా బాగా తీసుకోవాలి. ఇందులో నైట్రిక్ యాసిడ్ వుంటుంది. ఇది యూటరస్ లోకి రక్తసరఫరా బాగా జరగడానికి దోహదపడుతుంది. పీరియడ్ అయిన రెండు వారాల తరువాత బీట్రూల్ జ్యూస్ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ప్రయాణాలు ఏవైనా వుంటే మానకోవాలి. లేదంటే యూటరస్ స్థిరంగా లేకపోవడం వల్ల పిండం జారిపోయి బయటకు వచ్చే అవకాశం వుంది. ట్రావెల్ చేయడం వల్ల యూటరస్ ష్కేక్ అవుతుంది. దీంతో పిండానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
బరువులు ఎక్కువగా మోయవద్దు. ఇంట్లో కూడా ఎక్కువ పనులు చేయవద్దు. రెండు వారాలు చాలా జాగ్రత్తగా వుండాలి. మెట్లు ఎక్కడం, దిగడం లాంటి పనులకు కూడా మానుకోవాలి. ప్రెగ్నెన్సీ కచ్ఛితంగా కావాలనుకునేవారు ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సిందే.
పెయిన్ కిల్లర్ మెడిసిన్లను తీసుకోవద్దు. పెయిన్ కిల్లర్లు హార్మోన్లను ఇంబ్యాలెన్స్ చేస్తాయ్. వీటి వల్ల గర్భాశయంలో నొప్పులు వచ్చే అవకాశం వుంది. ఈ రెండు వారాలు ఎటువంటి పెయిన్ కిల్లర్లను ఉపయోగించవద్దు.
పడుకునే విధానం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. బోర్లా కాకుండా స్ట్రెయిట్గా పడుకోవాలి. ఈ విధానంలో రెండు వారాలపాటు పడుకోవాలి. వేడి నీళ్లతో కూడా స్నానం అస్సలు చేయకూడదు. చల్లనీటితో మాత్రమే స్నానం చేయాలి. ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నవారు కూడా అధికంగా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. దీని వల్ల గర్భాశయంలో ఉష్ణోగ్రత పెరిగి పిండం బయటకు జారే అవకాశం వుంది.
డీహైడ్రేషన్ కాకుండా కూడా జాగ్రత్త పడాలి. డీహైడ్రేషన్ గర్భాషయాన్ని బలహీనంగా మారుస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో నీరు వుండడం చాలా అవసరం. ఇది హార్మోన్లను చాలా బ్యాలెన్స్ చేస్తుంది. గర్భాశయం కూడా చాలా బలంగా వుంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. మొదటి రెండు వారాలు ప్రతీ రోజు 4 లీటర్ల నీరు తాగాలి.
మానసిక ఒత్తిడికి కూడా గురికాకుండా వుండాలి. ఉదయం లేవగానే ధ్యానం, యోగా చేసుకుంటే



Click it and Unblock the Notifications