Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదిరిపోయే..అమ్మ చేతి రుచిని గుర్తుచేసే వెల్లుల్లి పప్పుల పొడి
మన తెలుగు వారి వంటింటిలో పచ్చళ్ళు, పొడులకు ఉండే స్థానం ప్రత్యేకం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, కాస్త పొడి వేసుకుని తింటే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. అలాంటి పొడులలో రారాజు వంటిది వెల్లుల్లి పప్పుల పొడి. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరం.
ఇడ్లీ, దోశ, ఉప్మా, అన్నం..దేనితోనైనా వెల్లుల్లి పప్పుల పొడి ఇట్టే కలిసిపోతుంది. ఈ పొడిని తయారు చేయడం చాలా సులభం. వెల్లుల్లి పప్పుల పొడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు
శనగపప్పు - అర కప్పు
మినపప్పు - అర కప్పు
ఎండుమిర్చి - 15-20
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
చింతపండు - చిన్న నిమ్మకాయంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్ లేదా పొయ్యి మీద పెట్టి వేడి చేశాక అందులో శనగపప్పు వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. పప్పు చక్కటి బంగారు వర్ణంలోకి మారి, మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అదే విధంగా మినపప్పును కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పప్పులు మాడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
-ఇప్పుడు అదే బాండీలో ధనియాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించి, పప్పులు ఉన్న ప్లేట్ లోనే వేసుకోవాలి.
-తర్వాత బాండీలో ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా ఉబ్బి, రంగు మారే వరకు వేయించుకోవాలి. వాటిని కూడా ప్లేట్ లోకి మార్చాలి. చివరగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును వేసి అందులోని తేమ పోయి, కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు బాండీలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను వేయాలి. పొట్టుతో పాటే వేయిస్తే పొడికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు పైన కొద్దిగా రంగు మారి, మంచి వాసన వచ్చే వరకు 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది.
-వేయించిన పదార్థాలన్నింటినీ ఒక పెద్ద ప్లేట్ లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా ఎండుమిర్చి, పప్పులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని ఒకేసారి కాకుండా ఆపుతూ (పల్స్ మోడ్ లో) గ్రైండ్ చేస్తే పొడి వేడెక్కకుండా ఉంటుంది.
-తయారైన ఘుమఘుమలాడే వెల్లుల్లి పప్పుల పొడిని ఒక పొడి గాజు సీసాలో నింపి గాలి తగలకుండా మూత పెట్టుకుంటే నెల రోజుల వరకు తాజాగా, సువాసనగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







