Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదుర్స్..ఈ బీహార్ స్పెషల్ చట్నీ ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు
మనం రోజూ తినే అన్నం, కూరలు ఒక్కోసారి బోర్ కొడుతుంటాయి. ఆ సమయంలో నోటికి ఏదైనా కొత్తగా, రుచిగా తగలాలనిపిస్తుంటది?అలాంటప్పుడు బీహార్ ఫేమస్ టీసీ చట్నీ ట్రై చేయండి. ఒక్క ముద్దలో ఈ చట్నీని కలుపుకుని తింటే, ఆహారపు రుచి పదిరెట్లు పెరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
బీహార్ వాసులు టీసీ అని పిలిచే ఈ గింజలను మన తెలుగులో అవిసె గింజలు అంటాము. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి బీహార్ ప్రజలు ఈ చట్నీని ఔషధంలా భావించి మరీ తింటారు. బీహార్ ఫేమస్ అవిసె గింజల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
అవిసె గింజలు - అర కప్పు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు)- 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - అర కప్పు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి -5-6
తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6
మిరియాలు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా అవిసె గింజలను శుభ్రం చేసుకుని, అందులో రాళ్లు లేదా మట్టి లేకుండా చూసుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, అవిసె గింజలను మీడియం మంటపై వేయించాలి. అవి చిటపటలాడుతూ, మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి.
-అదే పాన్ లో కరివేపాకును వేసి, అందులోని తడి పోయి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చాక వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-చివరగా అదే పాన్ లో ఎండు కొబ్బరి తురుము, వేరుశెనగ గుళ్లు, తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి, మిశ్రమం లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, చిటికెడు ఇంగువ వేయాలి.
-ఈ మిశ్రమాన్ని మరీ మెత్తని పొడిలా కాకుండా, కాస్త బరకగా (ముతకగా) రుబ్బుకుంటే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది.
-అంతే ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ అవిసె గింజల చట్నీ రెడీ. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీలకు కూడా ఇది అదిరిపోయే కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








