Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదుర్స్..ఈ బీహార్ స్పెషల్ చట్నీ ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు
మనం రోజూ తినే అన్నం, కూరలు ఒక్కోసారి బోర్ కొడుతుంటాయి. ఆ సమయంలో నోటికి ఏదైనా కొత్తగా, రుచిగా తగలాలనిపిస్తుంటది?అలాంటప్పుడు బీహార్ ఫేమస్ టీసీ చట్నీ ట్రై చేయండి. ఒక్క ముద్దలో ఈ చట్నీని కలుపుకుని తింటే, ఆహారపు రుచి పదిరెట్లు పెరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
బీహార్ వాసులు టీసీ అని పిలిచే ఈ గింజలను మన తెలుగులో అవిసె గింజలు అంటాము. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి బీహార్ ప్రజలు ఈ చట్నీని ఔషధంలా భావించి మరీ తింటారు. బీహార్ ఫేమస్ అవిసె గింజల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
అవిసె గింజలు - అర కప్పు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు)- 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - అర కప్పు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి -5-6
తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6
మిరియాలు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా అవిసె గింజలను శుభ్రం చేసుకుని, అందులో రాళ్లు లేదా మట్టి లేకుండా చూసుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, అవిసె గింజలను మీడియం మంటపై వేయించాలి. అవి చిటపటలాడుతూ, మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి.
-అదే పాన్ లో కరివేపాకును వేసి, అందులోని తడి పోయి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చాక వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-చివరగా అదే పాన్ లో ఎండు కొబ్బరి తురుము, వేరుశెనగ గుళ్లు, తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి, మిశ్రమం లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, చిటికెడు ఇంగువ వేయాలి.
-ఈ మిశ్రమాన్ని మరీ మెత్తని పొడిలా కాకుండా, కాస్త బరకగా (ముతకగా) రుబ్బుకుంటే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది.
-అంతే ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ అవిసె గింజల చట్నీ రెడీ. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీలకు కూడా ఇది అదిరిపోయే కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications