Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదుర్స్..ఈ బీహార్ స్పెషల్ చట్నీ ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు
మనం రోజూ తినే అన్నం, కూరలు ఒక్కోసారి బోర్ కొడుతుంటాయి. ఆ సమయంలో నోటికి ఏదైనా కొత్తగా, రుచిగా తగలాలనిపిస్తుంటది?అలాంటప్పుడు బీహార్ ఫేమస్ టీసీ చట్నీ ట్రై చేయండి. ఒక్క ముద్దలో ఈ చట్నీని కలుపుకుని తింటే, ఆహారపు రుచి పదిరెట్లు పెరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
బీహార్ వాసులు టీసీ అని పిలిచే ఈ గింజలను మన తెలుగులో అవిసె గింజలు అంటాము. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి బీహార్ ప్రజలు ఈ చట్నీని ఔషధంలా భావించి మరీ తింటారు. బీహార్ ఫేమస్ అవిసె గింజల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
అవిసె గింజలు - అర కప్పు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు)- 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - అర కప్పు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి -5-6
తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6
మిరియాలు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా అవిసె గింజలను శుభ్రం చేసుకుని, అందులో రాళ్లు లేదా మట్టి లేకుండా చూసుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, అవిసె గింజలను మీడియం మంటపై వేయించాలి. అవి చిటపటలాడుతూ, మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి.
-అదే పాన్ లో కరివేపాకును వేసి, అందులోని తడి పోయి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చాక వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-చివరగా అదే పాన్ లో ఎండు కొబ్బరి తురుము, వేరుశెనగ గుళ్లు, తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయి, మిశ్రమం లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, చిటికెడు ఇంగువ వేయాలి.
-ఈ మిశ్రమాన్ని మరీ మెత్తని పొడిలా కాకుండా, కాస్త బరకగా (ముతకగా) రుబ్బుకుంటే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది.
-అంతే ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ అవిసె గింజల చట్నీ రెడీ. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీలకు కూడా ఇది అదిరిపోయే కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications