Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
తమిళనాడు స్పెషల్ గ్రేవీతో గుత్తి వంకాయ కర్రీ..తింటే నోట్లో బ్లాస్ట్!
ఎప్పుడూ చేసుకునే వంకాయ కూర, వేపుడు కాకుండా, తమిళనాడు సంప్రదాయ రుచులతో ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూరతో మీ భోజనాన్ని ఒక పండుగలా మార్చేయవచ్చు.
ఈ కూర ప్రత్యేకత..ఇంట్లోనే అప్పటికప్పుడు వేయించి నూరుకున్న ఒక మసాలా పొడి. ఈ పొడి సువాసన, రుచి ఈ కూరకి ప్రాణం పోస్తుంది. దీని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు.
కావలసిన పదార్థాలు
లేత వంకాయలు - పావు కిలో
సాంబార్ ఉల్లిపాయలు- 100 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 10
చింతపండు - పెద్ద నిమ్మకాయంత
పసుపు - అర టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
బియ్యప్పిండి - 1 టీస్పూన్
నువ్వుల నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 7
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
కందిపప్పు - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఎండు మిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, కందిపప్పు, మెంతులు, జీలకర్ర వేసి నూనె లేకుండానే మంచి సువాసన వచ్చేదాకా దోరగా వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించినవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు వేసి, ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టండి. తర్వాత బాగా పిసికి, చిక్కటి రసాన్ని తీసి, పిప్పిని పడేయండి.
-ఇప్పుడు వంకాయలను కడిగి, తొడిమలు తీయకుండా నాలుగు భాగాలుగా గాట్లు పెట్టండి. చిన్న ఉల్లిపాయలను పొట్టు తీసి సిద్ధంగా ఉంచుకోండి. వెల్లుల్లిని కొద్దిగా దంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ లేదా మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించండి.
-ఇప్పుడు అందులో వెల్లుల్లి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు, ఇంగువ వేసి ఒకసారి కలపండి.
-ఇప్పుడు గాట్లు పెట్టిన వంకాయలను అందులో వేసి అవి కొద్దిగా మగ్గేవరకు ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించండి.
-వంకాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, తయారు చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపండి. మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు 10-15 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి. పచ్చి వాసన పోయి, కూర చిక్కబడుతుంది.
-చివరగా ఒక చిన్న గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరలో పోసి కలపి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఘుమఘుమలాడే, కమ్మనైన గుత్తి వంకాయ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













