Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బెంగాళీ స్పెషల్ 'మాచ్చర్ జోల్'..వీధిలో వెళ్లేవాళ్లు కూడా వాసనకి పరిగెత్తుకొస్తారు..ఇదిగో రెపిపి
భిన్నమైన రుచులు ఆస్వాదించేవాళ్లకి బెంగాళీ స్పెషల్ మాచ్చర్ జోల్(machhar jhol) ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. పులుపు లేకుండా,కారం మితంగా ఘాటైన పరిమళంలో ఉండే ఈ బెంగాళీ స్టైల్ చేపల పులుసు తింటే నాలుక నాట్యమాడాల్సిందే. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బెంగాల్ స్పెషల్ మచ్చర్ జోల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మాచ్చర్ జోల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొచ్చె చేప ముక్కలు
-ఎండుమిర్చి
-ఉప్పు
-కారం
-పసుపు
-ఆవనూనె
-బంగాళదుంప
-అల్లం
-కళోంజి
-ఉల్లిపాయ
-బిర్యానీ ఆకు
మాచి జోల్ తయరీ విధానం
-ముందుగా శుభ్రంగా కడిగిన అరకిలో బొచ్చె చేప ముక్కలను లోతుగా ఉండే పాన్ లో వేయండి. చేప ముక్కలలో 1 టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి అన్నీ ముక్కలకు పట్టేలా చేతులతో కలుపుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 8 ఎండుమిర్చి, రెండు ఇంచుల అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి. తర్వాత అందులో కొంచెం నీళ్లు మళ్లీ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి దానిని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అరకప్పు ఆవాల నూనె పోడి వేడయ్యాక అందులో చేప ముక్కలను వేసి కదపకుండా 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. మంటను మీడియం ప్లేమ్ మీద ఉంచాలి.
-5 నిమిషాల తర్వాత చేప ముక్కలను తిరగేస్తూ ముక్క రెండు వైపులా ఎర్రగా అయ్యేలా వేపుకొని వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో ఉన్న నూనెలోనే 3 బంగాళదుంపలు చెక్కు తీసి పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి. బంగాళదుంప ముక్కలు క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న నూనెలోనే 3 బిర్యానీ ఆకులు, పావు టీస్పూన్ కళోంజి, అరకప్పు ఉల్లిపాయ చీలికలు వేసి వేపండి.
-ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం జీలకర్ర ఎండుమిర్చి పేస్ట్ ని వేసేసి నూనె పైకి తేలేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి.
-తర్వాత అందులో మెత్తగా గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోండి. టమాటో పేస్ట్ వేగేటప్పుడు అందులో అర టీస్పూన్ పంచదార కూడా వేసి కలిపి మూత పెట్టండి.
-టమాటో పేస్ట్ వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు,1 టీస్పూన్ ధనియాల పొడి,అర టీస్పూన్ కశ్మీరీ కారం, 4 టేబుల్ స్పూన్ల నీళ్లు, సరిపడా ఉప్పు వేసి వేపుకోండి. కారాలు వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో వేయించిన బంగాళదుంప ముక్కలు, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి హై ప్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత అందులో ఎర్రగా వేపుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టి 15 నిమిషాలు మంటను సిమ్ లో పెట్టండి.
-తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే మాచ్చర్ జోల్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












