Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
భోగి ప్రసాదం..దేవుడికి ఇష్టమైన నువ్వుల పులగం.. ఇలా చేస్తే రుచి అద్భుతం
తెలుగువారి లోగిళ్ళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి. ఈ ఏడాది భోగి పండుగను ఇవాళ(జనవరి 14,2026)జరుపుకుంటున్నాం. భోగి రోజున తలస్నానం ఆచరించిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పులగం(నువ్వులు కలిపిన అన్నం) సమర్పించడం ఆనవాయితీ.
దీనిని కొన్ని ప్రాంతాల్లో నువ్వుల అన్నం లేదా చిమ్మిలి అన్నం అని కూడా అంటారు. భోగి పండుగ శీతాకాలం చివరలో, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు అవసరం.
అందుకే మన పూర్వీకులు భోగి రోజున నువ్వుల పులగం తినే సంప్రదాయాన్ని పెట్టారు. నువ్వులు, నెయ్యి శరీరానికి వేడిని ఇస్తాయి, పెసరపప్పు సులభంగా జీర్ణమవుతుంది. భోగి స్పెషల్ నువ్వుల పులగం ఎలాతయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
కొత్త బియ్యం: 1 కప్పు
పొట్టు పెసరపప్పు (సాయి పప్పు): అర కప్పు
నువ్వులు (నల్లవి లేదా తెల్లవి): 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
మిరియాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
అల్లం: 1 అంగుళం ముక్క
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 4 కప్పులు
ఎండుమిరపకాయలు: 2
జీడిపప్పు: గుప్పెడు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పును తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి, సుమారు 20-30 నిమిషాల పాటు నానబెట్టండి. పెసరపప్పును నానబెట్టే ముందు దోరగా వేయించి కడిగితే పులగం మరింత కమ్మని వాసన వస్తుంది.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టి అందులో నువ్వులను వేసి నూనె లేకుండా వేయించాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి అందులో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు వేసి, దానికి తగినట్లుగా 1:3 లేదా 1:4 నిష్పత్తిలో నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ఆవిరి పోయాక అన్నాన్ని ఒకసారి కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. అదే నేతిలో జీలకర్ర, దంచిన మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.
-తాలింపు వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా తాలింపులో వేసి ఒక్క నిమిషం వేయించండి.
-ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న అన్నం-పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన జీడిపప్పును చల్లుకోండి.
-ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన భోగి స్పెషల్ నువ్వుల పులగం దేవుడికి నివేదించడానికి రెడీ.
-దీనిని చట్నీతో లేదా సాంబార్ తో తినవచ్చు లేదా అలాగే తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












