Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
చపాతీ, నాన్ లోకి ది బెస్ట్ కాంబినేషన్.. నోరూరించే పనీర్ యఖ్ని..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మనం హోటల్ స్టైల్ అని పనీర్ బటర్ మసాలా లేదా కడై పనీర్ వంటివే ఎక్కువగా చేస్తుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రకమైన రుచిని ఆస్వాదించడం ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. అందుకే ఈసారి మీ కుటుంబ సభ్యులను సర్ప్రైజ్ చేయడానికి కాస్త భిన్నంగా పనీర్ యాఖ్ని ట్రై చేయండి. ఇది ప్రసిద్ధ కాశ్మీరీ వంటకం.
ఘాటైన మసాలాలు, కమ్మనైన పెరుగు, జీడిపప్పు మిశ్రమంతో తయారయ్యే ఈ కూర చపాతీ, రోటీ లేదా నాన్ లోకి అద్భుతంగా ఉంటుంది. పనీర్ యాఖ్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ధనియాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు -అర టీస్పూన్
కాశ్మీరీ ఎండుమిర్చి - 4
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 3
యాలకులు - 2
నానబెట్టిన జీడిపప్పు - 10
గట్టి పెరుగు -అర కప్పు
పచ్చి పనీర్ ముక్కలు - 4
నూనె - 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
పనీర్ - 200 గ్రాములు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
ఎర్ర మిర్చి- 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ -అర టేబుల్ స్పూన్
పంచదార - అర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీరు - అర కప్పు
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, కాశ్మీరీ ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-అదే మిక్సీ జార్ లో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు, పెరుగు, 4 పచ్చి పనీర్ ముక్కలను వేయండి. వీటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక పనీర్ ముక్కలను వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-అదే నూనెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎర్ర మిర్చి ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి
-ఇప్పుడు అదే పాన్ లో సిద్ధం చేసుకున్న జీడిపప్పు-పెరుగు మిశ్రమాన్ని పోయండి. నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై కలపండి. ఇది కాస్త చిక్కబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపాక అర కప్పు నీరు పోసి గ్రేవీని బాగా మరిగించండి.
-గ్రేవీ మరుగుతున్నప్పుడు పంచదార వేయండి. తర్వాత వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు, వేయించిన ఉల్లిపాయ మిశ్రమాన్ని గ్రేవీలో వేసి బాగా కలపండి. మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన పనీర్ యఖ్ని రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications