Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తంజావూర్ స్పెషల్ రోజా పువ్వు చట్నీ..ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ కాంబినేషన్!..ఎలా చేసుకోవాలంటే..
ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు ప్లేట్లలోకి రాగానే నోరూరుతుంది. కానీ వాటి పక్కన రోజూ చూసే అదే కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఓసారి తమిళనాడులోని తంజావూర్ స్పెషల్ రోజూపువ్వు చట్నీ ట్రై చేసి చూడండి..అదిరిపోతుంది. దీని పేరు వినగానే ఇందులో గులాబీ రేకులు వేస్తారేమో అని కంగారు పడకండి.
ఈ చట్నీకి ఆ పేరు అది తయారయ్యాక కనిపించే అద్భుతమైన రోజూపువ్వు(లేత ఎరుపు) వల్ల వచ్చింది. చూపులకు ఆకర్షణీయంగా, నోటికి కమ్మగా తగిలే ఈ చట్నీని తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా ఈ చట్నీకి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం నాలుగు రోజుల పాటు అస్సలు పాడవదు. తంజావూర్ రోజా పువ్వు మిరపకాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తంజావూర్ రోజా పువ్వు చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు: 10
ఎండు మిరపకాయలు: 5
కాశ్మీరీ ఎండు మిరపకాయలు: 4
చింతపండు: కొద్దిగా
చిన్న టమాటో: 1
ఉప్పు: తగినంత
ఆవాలు: 1 టీస్పూన్
మినప పప్పు: 1 టీస్పూన్
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: ఒక రెమ్మ
తంజావూర్ రోజా పువ్వు చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు సగం వేగి, ఉడికిన తర్వాత మాత్రమే అందులో సాధారణ ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి వేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలు మాడిపోకుండా ఉండి, చట్నీకి ఆకర్షణీయమైన ఎరుపు లేదా గులాబీ రంగు వస్తుంది.
-ఇప్పుడు అందులో తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి బాగా కలపండి. టమాటో ముక్కలు బాగా మెత్తబడి గుజ్జులా మారేంత వరకు సన్నని మంటపై వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, దానికి తగినంత ఉప్పు జోడించి బరకగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీలో 3 చెంచాల నువ్వుల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపపప్పు వేసి చిటపటలాడనివ్వండి. చివరగా కరివేపాకు వేసి వేయించండి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఈ తాలింపులో వేసి బాగా కలపండి. సన్నని మంటపై సుమారు 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వండి. చట్నీ కాస్త చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి.
-అంతే కంటికి ఇంపుగా, నోటికి కమ్మగా ఉండే తంజావూర్ గులాబీ చట్నీ రెడీ. వేడి వేడి నెయ్యి ఇడ్లీలతో కానీ, పేపర్ లాంటి క్రిస్పీ దోసెలతో కానీ ఈ చట్నీని వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications