Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
15 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా ఎగ్ మసాలా..రుచి మొగ్గలకు కొత్త అనుభూతి
రోజూ తినే చపాతీ, దోసెల్లోకి అవే పాత కూరలు తిని విసిగిపోయారా? ఏదైనా కొత్తగా, రుచిగా ప్రయత్నించాలని ఉందా? అయితే కేవలం నాలుగు కోడిగుడ్లు, గుప్పెడు పుదీనాతో అదిరిపోయే పుదీనా ఎగ్ మసాలా ట్రై చేయండి. పలావ్, చపాతీ, దోస, పూరీ ఇలా దేనిలోకైనా సరే భలే ఉంటుంది.
సాధారణంగా ఎగ్ కర్రీ అంటే ఉల్లిపాయ, టమాటా గ్రేవీలో ఉడికించిన గుడ్లు వేసి వండటం మనకు అలవాటు. కానీ ఆ మూసధోరణికి భిన్నంగా తాజా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిల ఘాటైన మిశ్రమంతో చేసే ఈ గ్రేవీ మీ రుచి మొగ్గలకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. నోరూరించే ఎగ్ పుదీనా మసాలా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు - 4
పుదీనా ఆకులు - 1 కప్పు
కొత్తిమీర - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4-5
సోంపు - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1
కరివేపాకు - ఒక రెమ్మ
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2-3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గుడ్లు మునిగేంత నీరు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పెంకులు తీసి వాటికి చిన్నగా గాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో శుభ్రం చేసుకున్న కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-మసాలా వేపుడు: స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.
- ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టీస్పూన్ పసుపు వేసి కలిపి వెంటనే మనం సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్ ను అందులో వేయాలి. మంటను మీడియంలో ఉంచి పేస్ట్ లోని పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలేంత వరకు సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి.
-మసాలా చక్కగా ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. గ్రేవీ గుడ్లకు బాగా పట్టేలా మెల్లగా కలిపి, మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి.
-అంతే ఘుమఘుమలాడే, కమ్మని పుదీనా ఎగ్ గ్రేవీ రెడీ.
-ఈ వేడివేడి గ్రేవీని చపాతీ, పూరీ లేదా వేడివేడి అన్నంతో తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. ఈసారి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, ఈ కొత్త వంటకాన్ని చేసి పెడితే ప్రశంసలు ఖాయం
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications