Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గ్యాస్, అసిడిటీకి చెక్..పప్పు వండే అసలైన సీక్రెట్ రివీల్ చేసిన ప్రముఖ చెఫ్
భారతీయుల భోజనంలో పప్పుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పప్పు కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. అలాగే రోటీ, చపాతీల్లోకి కూడా పప్పు అద్భుతమైన కాంబినేషన్. శాకాహారులకైతే పప్పుధాన్యాలు ప్రోటీన్ల గని లాంటివి. మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను, విటమిన్లను ఇవి పుష్కలంగా అందిస్తాయి.
అయితే మనం వండే పప్పును నిజంగా సరైన పద్ధతిలోనే వండుతున్నామా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది అవును'అనే చెబుతారు. కానీ ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా మాత్రం మనం పప్పు వండే విధానంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నామని చెబుతున్నారు. మనలో చాలా మంది పప్పును తప్పుగా వండటం వల్లే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలిపారు.

మనం చేసే సాధారణ తప్పు ఇదే
సాధారణంగా మన ఇళ్లలో పప్పును నీళ్లలో కడిగేసి, నేరుగా ప్రెషర్
కుక్కర్ లో వేస్తారు. అందులో సరిపడా నీళ్లు, పసుపు, ఉప్పు
వేసి మూతపెట్టి విజిల్స్ రానిస్తారు. కానీ ఇలా వండటం వల్ల పప్పులోని
పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందవు.
పప్పును వండే సరైన విధానం
మొదటగా పప్పును శుభ్రమైన నీటిలో రెండు మూడు సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత నేరుగా కుక్కర్ లో వేసి ఉడికించకూడదు.
1. కడిగిన పప్పులో మంచి నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
2. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే... పప్పును నానబెట్టిన నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటకు వాడకూడదు, దానిని పారబోయాలి. ఎందుకంటే, పప్పు ధాన్యాలలో ఫైటిక్ యాసిడ్(Phytic acid) అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ఐరన్, జింక్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. నానబెట్టిన నీటిని పారబోయడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.
3. ఇప్పుడు నానబెట్టిన పప్పును ప్రెషర్ కుక్కర్ లో వేసి, వంటకు సరిపడా కొత్త నీటిని పోయాలి. వెంటనే కుక్కర్ మూత పెట్టేయకూడదు. కుక్కర్ మూత తీసే ఉంచి, స్టవ్ ఆన్ చేసి కొన్ని నిమిషాల పాటు పప్పును ఉడకనివ్వాలి. పప్పు ఉడకడం ప్రారంభం కాగానే, నీటిపై ఒక తెల్లటి నురుగు లాంటి పొర ఏర్పడటం మీరు గమనిస్తారు. ఒక గరిటె తీసుకుని ఆ నురుగును పూర్తిగా తీసేసి పారబోయాలి. ఆ నురుగులో సాపోనిన్స్ (Saponins), ఇతర మలినాలు ఉంటాయి. వీటిని తొలగించకుండా పప్పును వండితే, అది త్వరగా జీర్ణం కాక కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.
4.పప్పుపై వచ్చే నురుగును పూర్తిగా తొలగించిన తర్వాతే, అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేయాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన పప్పుకు మీకిష్టమైన రీతిలో పోపు (తాలింపు) పెట్టుకుంటే సరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications