Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శ్రీలంక ఫేమస్ యెల్లో రైస్..ముద్ద నోట్లో పెట్టుకుంటే కేక ఉంది అంటారు..మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మన పొరుగు దేశం శ్రీలంక ప్రకృతి సౌందర్యానికి ఎంత ప్రసిద్దో అక్కడి వంటకాలు కూడా అంతే ప్రసిద్ది చెందాయి. శ్రీలంకలో ఏ పండుగ జరిగినా,ఏ శుభకార్యం అయినా,ప్రత్యేక సందర్భాల్లో కహా బాత్ తప్పక ఉండాల్సిందే. దీనిని యెల్లో రైస్ అని కూడా పిలుస్తారు. కహా అంటే సింహళ భాషలో పసుపు అని..బాత్ అంటే అన్నం అని అర్థం. కనుక కహా బాత్ అంటే పసుపు అన్నం లేదా యెల్లో రైస్ అని అర్థమన్నమాట.
శ్రీలంకలో కొత్త సంవత్సరంలో మొట్టమొదటి భోజనంగా చాలా కుటుంబాలు కహా బాత్ నే స్వీకరిస్తాయి. ఇది వారి జీవితంలోకి కొత్త వెలుగును, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. దీని తయారీ చాలా సులభం, కానీ దాని రుచి మాత్రం అమోఘం. మీ ఇంట్లోనే ఈజీగా శ్రీలంక స్పెషల్ యెల్లో రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
యెల్లో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం: 2 కప్పులు
చిక్కటి కొబ్బరి పాలు: 1 కప్పు (మొదటి పాలు)
పల్చటి కొబ్బరి పాలు: 2 కప్పులు (రెండవ పాలు)
పసుపు: 1 టీస్పూన్
ఉల్లిపాయ: 1
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
యాలకులు: 3-4
లవంగాలు: 4-5
కరివేపాకు: రెండు రెమ్మలు
రెంప ఆకులు (Pandan Leaves): చిన్న ముక్క (లేకపోతే వదిలేయండి)
నిమ్మగడ్డి: ఒక చిన్న కాడ
ఉప్పు: రుచికి సరిపడా
వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,వేయించిన ఉల్లిపాయ ముక్కలు
తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రెంప ఆకులు, నిమ్మగడ్డి (ఉపయోగిస్తుంటే) వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలపాలి.
-ఇప్పుడు నానబెట్టి వడకట్టిన బియ్యాన్ని అందులో వేసి, సుగంధ ద్రవ్యాలతో బాగా కలిసేలా రెండు నిమిషాలు మెల్లగా వేయించాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది. ఆ తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు చిక్కటి కొబ్బరి పాలు, పల్చటి కొబ్బరి పాలు పోయాలి. అంతా బాగా కలిపి మిశ్రమాన్ని ఒకసారి మరిగించాలి. మంటను పూర్తిగా తగ్గించి గిన్నెపై మూత పెట్టి బియ్యం మెత్తగా ఉడికి, ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి.
-అన్నం ఉడికిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా మరో 10 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. దీనివల్ల అన్నం మరింత పొడిగా, రుచిగా తయారవుతుంది. తర్వాత ఒక ఫోర్క్ తో మెల్లగా అన్నాన్ని కదిపితే, మెతుకులు విడివిడిగా వస్తాయి. అంతే వేడి వేడి యెల్లో రైస్ రెడీ.
-వేడి వేడి యెల్లో రైస్ ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేయించిన ఉల్లిపాయలతో అలంకరించి నోట్లో పెట్టుకుంటే అమృతమే అంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








