Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
15 నిమిషాల్లోనే రుచి,ఆరోగ్యం..నోరూరించే పాలక్ దోస..ఎలా చేసుకోవాలంటే
ఉదయం పూట హడావిడిలో ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? రోజూ తినే ఇడ్లీ, దోసలకు భిన్నంగా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే టిఫిన్ కోసం చూస్తున్నారా? కేవలం 15 నిమిషాల్లో, ప్రోటీన్, ఫైబర్, పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. అదే నోరూరించే పాలక్ దోస. పాలక్ దోస కేవలం ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉండటమే కాదు, దాని రుచి మిమ్మల్ని మళ్లీ మళ్లీ తినేలా చేస్తుంది. పాలకూరలోని అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వంటకాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.పాలక్ దోస ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలక్ దోస తయారీకీ కావాల్సిన పదార్థాలు
-బియ్యం - 2 కప్పులు
-మినపప్పు - అర కప్పు
-తాజా పాలకూర - 2 కప్పులు
-పెరుగు - అర కప్పు
-పచ్చిమిర్చి - 2
-అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
-కొబ్బరి తురుము - అర కప్పు
-ఉప్పు - రుచికి సరిపడా
-నెయ్యి/నూనె - దోసెలు వేయించడానికి
తయారీ విధానం
-ముందుగా బియ్యం, మినపప్పును కడిగి కనీసం 4-6 గంటలు విడివిడిగా నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని రాత్రంతా లేదా కనీసం 6-8 గంటలు పులియబెట్టాలి.
-శుభ్రం చేసిన పాలకూరను వేడినీటిలో రెండు నిమిషాలు ఉంచి వెంటనే చల్లటి నీటిలో వేయాలి. దీనివల్ల పాలకూర రంగు, పోషకాలు పోకుండా ఉంటాయి.
-ఇప్పుడు పాలకూర, పచ్చిమిర్చి, అల్లం కొబ్బరి తురుమును మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
-పులిసిన దోస పిండిలో ఈ పాలకూర పేస్ట్, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి వేడి చేయాలి. కొద్దిగా నెయ్యి రాసి, ఒక గరిటెడు పిండిని తీసుకుని గుండ్రంగా, పల్చగా దోసెలా వేసుకోవాలి.
-మీడియం మంటపై దోసె బంగారు రంగులోకి, క్రిస్పీగా మారే వరకు కాల్చి, రెండో వైపుకు తిప్పి ఒక్క నిమిషం పాటు కాల్చాలి. అంతే వేడివేడి, టేస్టీ, హెల్తీ పాలక్ దోస రెడీ. దీనిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే... ఆ రుచే వేరు.
కొన్ని ప్రయోజనాలు
రక్తహీనతకు చెక్: పాలకూరలో ఐరన్, విటమిన్ A, K, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించి, మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి.
బరువు అదుపులో: బియ్యం, మినపప్పుల కలయిక శరీరానికి అవసరమైన ప్రోటీన్ను అందిస్తుంది. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు: దోస పిండిని పులియబెట్టడం వల్ల దానిలోని
పోషకాలు మన శరీరం తేలికగా గ్రహించేలా మారతాయి. ఇది పేగు ఆరోగ్యానికి
చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










