Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
సీతాఫలంతో ఖీర్, మిల్క్ షేక్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే వహ్వా అనాల్సిందే!
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. సహజసిద్ధంగా పండే ఈ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ A, Cతో పాటు యాంటీ యాక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు లభించే ఈ పండును చాలా మంది తింటూ ఉంటారు. అయితే వీటితో స్వీట్స్ కూడా చేసుకోవచ్చని తెలియదు. ఈ రోజు సీతాఫలంతో స్వీట్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సీతాఫలాలతో ఖీర్తో పాటు మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు. అయితే ఆ స్వీట్స్ని ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు అనేది ఈ స్టోరీలో వివరించాం చూడండి.
సీతాఫలం ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక లీటర్ చిక్కటి పాలు
గింజలు తీసిన ఒక కప్పు సీతాఫలం గుజ్జు
సరిపడ చెక్కెర
రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు
ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్
పంచదార కలపని యాభై గ్రాముల పచ్చికోవా
ఒక టీ స్పూన్ యాలకుల పొడి

సీతాఫలం ఖీర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఆ పాలను మరిగించుకోవాలి. అనంతరం స్టవ్ తక్కువ చేసి.. అందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని.. పాలు గిన్నెలో సగం అయ్యేంతవరకు మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ పాలలో ఈ ఖీర్ చేయడానికి సరిపడా చెక్కెర, 50 గ్రాముల పచ్చికోవా వేసుకొని కలుపుకోవాలి.
అనంతరం చెక్కెర తియ్యగా ఉందా లేదా ఇంకొంచెం వేయాల్సి వస్తే వేసుకోవచ్చు. రుచికి సరిపడా చెక్కర వేసుకున్న తరువాత.. కోవా మొత్తం కరిగే విధంగా కలుపుతూ మరిగించుకోవాలి. తరువాత ముందుగా గింజలు తీసిపెట్టుకున్న సీతాఫలం గుజ్జును పాలలో వేసుకొని.. ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఖీర్ దగ్గరపడ్డ తరువాత కిందకి దించుకుంటే.. సీతాఫలం ఖీర్ సిద్ధమైనట్లే.
దీనిని వేడివేడిగా అయినా తినొచ్చు. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఎలా తిన్నా దీనికి సంబంధించిన రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒకసారి తింటే ఇంకోసారి తినే విధంగా ఉంటుంది.
సీతాఫలం మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక లీటర్ చిక్కని పాలు
రెండు పండిన సీతాఫలాలు
రెండు టేబుల్ స్పూన్ల చెక్కర
అయిదు జీడిపప్పు,
అయిదు బాదంపప్పు
సీతాఫలం మిల్క్ షేక్ తయారీ విధానం
ముందుగా సీతాఫలం నుంచి గుజ్జు తీసి ఒక కప్పులో వేసుకోవాలి. అనంతరం ఒక మిక్సీలో సీతాఫలం గుజ్జు, జీడిపప్పు, బాదంపప్పు, పంచదార(కావాలనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు), పాలు వేసుకొని బాగా కలిపేవిధంగా బ్లెండ్ చేసుకోవాలి. అనంతరం మిల్క్ షేక్పై డ్రై ఫ్రూట్స్ తురుము, కొంచెం సీతాఫలం గుజ్జును గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అనంతరం ఆ మిల్క్ షేక్ను ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications