Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పైకి కరకరలాడుతూ,లోపల జ్యూసీగా..తిన్నకొద్దీ తినాలనిపించే ఒడిషా స్పెషల్ ధాారాక్షి స్వీట్
భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు, వైవిధ్యభరితమైన ఆహారానికి పుట్టినిల్లు. ప్రతి రాష్ట్రానికి దాని ప్రత్యేకమైన వంటకాలు, రుచులు ఉంటాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రతి ఇంటా పిండివంటల సువాసనలు గుబాళిస్తాయి. అలాంటి అద్భుతమైన, సంప్రదాయబద్ధమైన రుచులను అందించడంలో ఒడిషా రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. రసగుల్లా వంటి ప్రసిద్ధ మిఠాయిలతో పాటు ఒడిషాలో అంతగా ప్రాచుర్యం పొందని రుచికరమైన స్వీట్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ధారాక్య. దీనిని ధారాక్షి అని కూడా పిలుస్తారు.
ఒడిషాలో ముఖ్యంగా దీపావళి, హోలీ వంటి పండుగలకు, శుభకార్యాలకు దీనిని తప్పకుండా తయారుచేసుకుంటారు. ఆంధ్రాలోని శ్రీకాకుళం,విజయనగరం వంటి ప్రాంతాల్లో కూడా దీనిని తయారుచేస్తారు. పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉంటుంది. ధారాక్షి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ధారాక్షి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-చక్కెర
-యాలకల పొడి
-ఆయిల్
-ఉప్పు
-మినపప్పు
-నిమ్మరసం
ధారాక్షి తయారీ విధానం
-ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు పొట్టుతో ఉండే పెసరపప్పు, పావుకప్పు పొట్టుతో ఉండే మినపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత చేత్తో గట్టిగా పిసుకుతూ పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడుగుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి లేదా బాండీ పెట్టి అందులో 2 కప్పుల చక్కెర, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మంటను మీడియంలో ఉంచి 5-6 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఎలాంటి తీగ పాకం రానక్కర్లేదు. జిడ్డుగా అయిన తర్వాత అందులో పావు టీస్పూన్ యాలకల పొడి, అరచెక్క నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆప్ చేసి బాండీ మీద మూతపెట్టి వదిలేయండి.
-ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పును గ్రైండర్ లేదా మిక్సీలో వేసి ఉప్పు కూడా కొద్దిగా వేసి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మెత్తగా,ఫ్లఫ్పీగా రావాలి, కావాలనుకుంటే 2 టేబుల్ స్సూన్ల నీళ్లను గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో కలుపుకోండి. పిండి జారిపోకుండా,గట్టిగా ఉండకుండా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక పిండిని పాలప్యాకెట్ లో పిండిని నింపి ప్యాకెట్ కు ఒక మూలన రంధ్రం చేసి అయినా లేదా సాస్ బాటిల్ సహాయంతో అయినా లేదా చిల్లుల గరిటె సహాయంతో అయినా పిండిని ఆయిల్ లో వేసుకోవాలి. పిండి షేపు షేపు పొడవుగా ఉండేలా చూసుకోండి.
-క్రిస్పీగా, గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత బాండీలో వేగిన వాటిని తీసి ముందుగా రెడీ చేసుకున్న వేడి చక్కెర పాకంలో వేసుకొని 10 సెకన్ల పాటు ఉంచి తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి.అంతే ధారాక్షి స్వీట్ రెసిపి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications